అబుదాబిలో అక్రమ బిల్బోర్డ్లు, సైనేజ్లు: Dh8,000 వరకు జరిమానాలు..!!
- May 26, 2025
యూఏఈ: అబుదాబి అధికారులు ఎమిరేట్లో ఆమోదించబడిన ప్రమాణాలకు అనుగుణంగా బిల్బోర్డ్లు, సైనేజ్లను ఉంచాలని స్పష్టం చేశారు. లేదంటే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. పునరావృత నేరాలకు జరిమానాలు అధికం అవుతాయని సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆ పోస్ట్లో అబుదాబి DMT చట్టంలోని ఆర్టికల్ 66ని ప్రకారం.. పర్మిట్ లేకుండా లేదా గడువు ముగిసిన పర్మిట్తో ప్రకటనలను ఉపయోగించడం చేస్తే.. మొదటి నేరానికి 2,000 దిర్హామ్ల జరిమానా; రెండవ నేరానికి 4,000 దిర్హామ్ల జరిమానా; మూడవ నేరానికి 8,000 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని పేర్కొంది. అంతేకాకుండా, చెల్లుబాటు అయ్యే పర్మిట్ లేకుండా లేదా గడువు ముగిసిన పర్మిట్తో బిల్బోర్డ్ను ఉపయోగించడం మొదటి, రెండవ, తదుపరి నేరస్థులకు 2000 దిర్హామ్ల, 4,000, 8,000 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







