అబుదాబిలో అక్రమ బిల్బోర్డ్లు, సైనేజ్లు: Dh8,000 వరకు జరిమానాలు..!!
- May 26, 2025
యూఏఈ: అబుదాబి అధికారులు ఎమిరేట్లో ఆమోదించబడిన ప్రమాణాలకు అనుగుణంగా బిల్బోర్డ్లు, సైనేజ్లను ఉంచాలని స్పష్టం చేశారు. లేదంటే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. పునరావృత నేరాలకు జరిమానాలు అధికం అవుతాయని సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆ పోస్ట్లో అబుదాబి DMT చట్టంలోని ఆర్టికల్ 66ని ప్రకారం.. పర్మిట్ లేకుండా లేదా గడువు ముగిసిన పర్మిట్తో ప్రకటనలను ఉపయోగించడం చేస్తే.. మొదటి నేరానికి 2,000 దిర్హామ్ల జరిమానా; రెండవ నేరానికి 4,000 దిర్హామ్ల జరిమానా; మూడవ నేరానికి 8,000 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని పేర్కొంది. అంతేకాకుండా, చెల్లుబాటు అయ్యే పర్మిట్ లేకుండా లేదా గడువు ముగిసిన పర్మిట్తో బిల్బోర్డ్ను ఉపయోగించడం మొదటి, రెండవ, తదుపరి నేరస్థులకు 2000 దిర్హామ్ల, 4,000, 8,000 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!