తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- February 10, 2026
న్యూ ఢిల్లీ: తిరుపతి విమానాశ్రయం నుండి గల్ఫ్,యూరప్,అమెరికా మరియు అబుదాబి దేశాలకు నేరుగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని"రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాధరెడ్డి" కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప, అన్నమయ్య,నెల్లూరు, చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో గల్ఫ్, యూరప్ మరియు పాశ్చాత్య దేశాలలో ఉపాధి పొందుతున్నారని మరియు ఈ ప్రాంతాలనుండి ప్రయాణీకులు ఉన్నత విద్య, ఉద్యోగరీత్యా, వ్యాపారం కోసం తరచుగా ప్రయాణిస్తుంటారని, తిరుపతి నుండి నేరుగా అంతర్జాతీయ కనెక్టివిటీ లేకపోవడం వలన చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాద్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు.ఇది అనవసరమైన ఆర్ధిక భారాన్ని ముఖ్యంగా ఉపాధి కోసం వెళ్ళేవారికి ఆర్ధిక పరమైన భారాన్ని ఎక్కువ ప్రయాణ సమయాన్ని సీనియర్ సిటిజెన్ లకు, మహిళలు మరియు పిల్లలకు మరింత ఇబ్బందిగా మారిందని తెలిపారు.ఇదే కాకుండా దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రం అయినా తిరుమలకు పాశ్చాత్య దేశాలలో నివసిస్తున్న ఎన్నారైలు నేరుగా తిరుపతికి రావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
కావున ప్రయాణీకుల ప్రయోజనాల దృష్ట్యా మరియు ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తిరుపతి నుండి నేరుగా గల్ఫ్ మరియు వివిధ దేశాలకు నేరుగా అంతర్జాతీయ సర్వీసులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా విమానయాన సంస్థలు మరియు విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









