తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- February 10, 2026
న్యూ ఢిల్లీ: తిరుపతి విమానాశ్రయం నుండి గల్ఫ్,యూరప్,అమెరికా మరియు అబుదాబి దేశాలకు నేరుగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని"రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాధరెడ్డి" కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప, అన్నమయ్య,నెల్లూరు, చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో గల్ఫ్, యూరప్ మరియు పాశ్చాత్య దేశాలలో ఉపాధి పొందుతున్నారని మరియు ఈ ప్రాంతాలనుండి ప్రయాణీకులు ఉన్నత విద్య, ఉద్యోగరీత్యా, వ్యాపారం కోసం తరచుగా ప్రయాణిస్తుంటారని, తిరుపతి నుండి నేరుగా అంతర్జాతీయ కనెక్టివిటీ లేకపోవడం వలన చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాద్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు.ఇది అనవసరమైన ఆర్ధిక భారాన్ని ముఖ్యంగా ఉపాధి కోసం వెళ్ళేవారికి ఆర్ధిక పరమైన భారాన్ని ఎక్కువ ప్రయాణ సమయాన్ని సీనియర్ సిటిజెన్ లకు, మహిళలు మరియు పిల్లలకు మరింత ఇబ్బందిగా మారిందని తెలిపారు.ఇదే కాకుండా దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రం అయినా తిరుమలకు పాశ్చాత్య దేశాలలో నివసిస్తున్న ఎన్నారైలు నేరుగా తిరుపతికి రావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
కావున ప్రయాణీకుల ప్రయోజనాల దృష్ట్యా మరియు ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తిరుపతి నుండి నేరుగా గల్ఫ్ మరియు వివిధ దేశాలకు నేరుగా అంతర్జాతీయ సర్వీసులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా విమానయాన సంస్థలు మరియు విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









