తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి

- February 10, 2026 , by Maagulf
తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి

న్యూ ఢిల్లీ: తిరుపతి విమానాశ్రయం నుండి గల్ఫ్,యూరప్,అమెరికా మరియు అబుదాబి దేశాలకు నేరుగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని"రాజ్యసభ సభ్యులు ఎంపీ  మేడా రఘునాధరెడ్డి" కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప, అన్నమయ్య,నెల్లూరు, చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో గల్ఫ్, యూరప్ మరియు పాశ్చాత్య  దేశాలలో ఉపాధి పొందుతున్నారని మరియు ఈ ప్రాంతాలనుండి ప్రయాణీకులు ఉన్నత విద్య, ఉద్యోగరీత్యా, వ్యాపారం కోసం తరచుగా ప్రయాణిస్తుంటారని, తిరుపతి నుండి నేరుగా అంతర్జాతీయ కనెక్టివిటీ లేకపోవడం వలన చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాద్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు.ఇది అనవసరమైన ఆర్ధిక భారాన్ని ముఖ్యంగా ఉపాధి కోసం వెళ్ళేవారికి ఆర్ధిక పరమైన భారాన్ని ఎక్కువ ప్రయాణ సమయాన్ని సీనియర్ సిటిజెన్ లకు, మహిళలు మరియు పిల్లలకు మరింత ఇబ్బందిగా మారిందని తెలిపారు.ఇదే కాకుండా దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రం అయినా తిరుమలకు పాశ్చాత్య దేశాలలో నివసిస్తున్న ఎన్నారైలు నేరుగా తిరుపతికి రావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

కావున ప్రయాణీకుల ప్రయోజనాల దృష్ట్యా మరియు ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తిరుపతి నుండి నేరుగా గల్ఫ్ మరియు వివిధ దేశాలకు నేరుగా అంతర్జాతీయ సర్వీసులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా విమానయాన సంస్థలు మరియు విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com