రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- February 10, 2026
అమరావతి: రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఉపవాసాలు పాటిస్తున్న ముస్లిం ఉద్యోగులు (ఉపాధ్యాయులతో సహా) తమ విధుల నుంచి రోజుకు ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఉపవాసాల సమయంలో ఉద్యోగులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రార్థనలు సక్రమంగా నిర్వహించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వెసులుబాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రంజాన్ మాసం ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యతో ఉద్యోగుల ఆధ్యాత్మిక అవసరాలు, ఉద్యోగ బాధ్యతలు రెండింటికీ సమతుల్యం చేకూరుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









