రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- February 10, 2026
అమరావతి: రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఉపవాసాలు పాటిస్తున్న ముస్లిం ఉద్యోగులు (ఉపాధ్యాయులతో సహా) తమ విధుల నుంచి రోజుకు ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఉపవాసాల సమయంలో ఉద్యోగులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రార్థనలు సక్రమంగా నిర్వహించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వెసులుబాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రంజాన్ మాసం ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యతో ఉద్యోగుల ఆధ్యాత్మిక అవసరాలు, ఉద్యోగ బాధ్యతలు రెండింటికీ సమతుల్యం చేకూరుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







