రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- February 10, 2026
అమరావతి: రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఉపవాసాలు పాటిస్తున్న ముస్లిం ఉద్యోగులు (ఉపాధ్యాయులతో సహా) తమ విధుల నుంచి రోజుకు ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఉపవాసాల సమయంలో ఉద్యోగులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రార్థనలు సక్రమంగా నిర్వహించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వెసులుబాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రంజాన్ మాసం ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యతో ఉద్యోగుల ఆధ్యాత్మిక అవసరాలు, ఉద్యోగ బాధ్యతలు రెండింటికీ సమతుల్యం చేకూరుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









