రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- February 10, 2026
అమరావతి: రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఉపవాసాలు పాటిస్తున్న ముస్లిం ఉద్యోగులు (ఉపాధ్యాయులతో సహా) తమ విధుల నుంచి రోజుకు ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఉపవాసాల సమయంలో ఉద్యోగులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రార్థనలు సక్రమంగా నిర్వహించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వెసులుబాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రంజాన్ మాసం ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యతో ఉద్యోగుల ఆధ్యాత్మిక అవసరాలు, ఉద్యోగ బాధ్యతలు రెండింటికీ సమతుల్యం చేకూరుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









