'ట్రూజెట్ ఎయిర్వేస్' తొలి వార్షికోత్సవ వేడుకలు
- July 11, 2016
టాలీవుడ్ యువ కథానాయకుడు రాంచరణ్ తేజ భాగస్వామిగా పౌర విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన 'ట్రూజెట్ ఎయిర్వేస్' సంస్థకు జులై 12తో ఏడాది పూర్తైంది. ఈ క్రమంలో మంగళవారం తొలి వార్షికోత్సవ వేడుకలను ఆ సంస్థ నిర్వహిస్తోంది.ఈ నేపథ్యంలో 'కనెక్టింగ్ ఇండియా ఆఫర్' పేరిట ఆ సంస్థ కొత్త ప్రమోషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. గత సంవత్సరం జులై 12న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చెర్రీ ఫ్లైట్స్ ప్రయాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత రెండు మార్గాల్లోనే విమానాలను నడిపిన ట్రూజెట్... ప్రస్తుతం 5 మార్గాల్లో విమానాలను నడుపుతోంది.విజయవాడ-కడప-విజయవాడ, చెన్నై-కడప-చెన్నై, హైదరాబాగ్-కడప- హైదరాబాదు, కడప-తిరుపతి, హైదరాబాగ్-ఔరంగాబాదు మార్గాల్లో ప్రస్తుతం ట్రూజెట్ విమానాలు సేవలందిస్తున్నాయి.
కాగా, తొలి వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రారంభించిన 'కనెక్టింగ్ ఇండియా ఆఫర్' ద్వారా ట్రూజెట్, లేదా ఏదేనీ ఇతర ఎయిర్ లైన్స్ లో అదే రోజుల ప్రయాణించిన ప్రయాణికులకు రూ.500 విలువ కలిగిన వోచర్ను ఆ సంస్థ అందించనున్నట్లు పేర్కొంది. తాను సేవలందిస్తున్న ప్రాంతాలతో దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఆ సంస్థ ప్రకటించింది
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







