రాగి వడలు
- July 11, 2016
కావాల్సిన పదార్థాలు :
శనగపిండి : అరకిలో నూనె : సరిపడా ఉల్లిగడ్డలు : ఒకటి రాగిపిండి : ఒక కప్పు ఉప్పు : తగినంత పచ్చిమిర్చి : రెండు కరివెపాకు : ఒక రెమ్మ పల్లీలు : 150 గ్రాములు.
తయారు చేసే విధానం:
ఒక పాత్రలో రాగిపిండి, శనగపిండి తీసుకోవాలి. అనంతరం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకును సన్నగా తరుక్కుకోవాలి. వీటిని పిండిలో కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. వీటిని కొంచెం కొంచెం నీరు పోస్తూ వడల పిండిగా కలుపుకోవాలి. పల్లీలు వేయించుకుని ఈ పిండి మిశ్రమంలో కలుపుకోవాలి. మూకుడు తీసుకుని నూనె వేయాలి. నూనె వేడయిన తరువాత చిన్న చిన్న పిండిని ముద్దలుగా తీసుకుని చేతితో వత్తుతూ నూనెలో వేయండి. అవి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే ఎంతో రుచికరమైన 'రాగి వడలు' రెడీ.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







