షార్జాలో ప్రభుత్వ రంగానికి 4 రోజులపాటు సెలవులు..!!
- May 29, 2025
యూఏఈ: ఈద్ అల్ అధాకు నాలుగు రోజులపాటు ప్రభుత్వ సెలవులను షార్జా ప్రకటించింది. ఈ సెలవులు జూన్ 5, అరాఫా దినోత్సవం నుండి ప్రారంభమై జూన్ 8 వరకు కొనసాగుతుంది. షిఫ్ట్ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. జూన్ 9 నుండి అధికారిక పనివేళలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించారు. షార్జా ప్రభుత్వ విభాగాలు, అధికారులు, సంస్థలలో పనిచేసే వారికి ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు.
ఫెడరల్ అథారిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ యూఏఈలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరం ఈద్ అల్ అధాకు నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించింది. జుల్ హిజ్జా 9 నుండి జుల్ హిజ్జా 12 వరకు దేశం సెలవుదినాన్ని పాటిస్తుందని అథారిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మే 27 సాయంత్రం జుల్ హిజ్జా నెలవంక కనిపించిన తర్వాత, జూన్ 6 నాడు యూఏఈ ఈద్ అల్ అధాను జరుపుకుంటుంది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







