ఫ్యామిలీ వీసా కోసం పే-స్లిప్ లో మానిపులేషన్..పలువురు ప్రవాసులకు నోటీసులు..!!
- May 29, 2025
కువైట్: కువైట్లో కుటుంబ వీసాలను నియంత్రించే నిబంధనలను ఉల్లంఘించినందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని నివాస వ్యవహారాల దర్యాప్తు విభాగం అనేక మంది ప్రవాసులకు నోటీసులు జారీ చేసింది. అధికారుల కథనం ప్రకారం.. చాలా మంది వ్యక్తులు KD 800 జీతం ఉందని, కుటుంబ వీసాలకు దరఖాస్తు చేసుకోగా.. వారికి అనమతి ఇచ్చారు. అయితే, వీసాలు పొందిన తర్వాత, వారు అధికారికంగా తక్కువ జీతాలను పొందారు. తద్వారా మంత్రివర్గ నిర్ణయం నిబంధనలను ఉల్లంఘించారని గుర్తించారు.
కుటుంబ వీసాలను పొందడానికి ఈ ప్రవాసులు KD 800 నెలవారీ ఆదాయాన్ని తెలిపే తప్పుడు సాలరీ సర్టిఫికేషన్ లను సమర్పించారని విచారణలో గుర్తించారు. కాగా, అధికారులు ఉల్లంఘించిన వారికి వారి నివాస స్థితిని సరిదిద్దుకోవడానికి లేదా వారి కుటుంబాలను స్వదేశానికి తిరిగి పంపించడానికి ఒక నెల గడువు ఇచ్చారు. సమన్లు పొందిన ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి ఉంటామని అధికారికంగా డిక్లరేషన్ పై సంతకం చేయాలని నిర్దేశించారు.
కుటుంబ పెద్ద తమ కుటుంబానికి మంచి జీవన ప్రమాణాలను అందించడానికి ఈ స్థాయి ఆదాయం అవసరమని సూచించే అధ్యయనాల ఆధారంగా KD 800 జీతం పరిమితిని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వివరించాయి. జాతీయత లేదా విద్యార్హతలతో సంబంధం లేకుండా, అందరూ ప్రవాసులు జీతం అవసరాలను తీర్చినట్లయితే, వారి కుటుంబాలను కువైట్కు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ అనుమతిస్తుందని స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







