ఫ్యామిలీ వీసా కోసం పే-స్లిప్ లో మానిపులేషన్..పలువురు ప్రవాసులకు నోటీసులు..!!
- May 29, 2025
కువైట్: కువైట్లో కుటుంబ వీసాలను నియంత్రించే నిబంధనలను ఉల్లంఘించినందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని నివాస వ్యవహారాల దర్యాప్తు విభాగం అనేక మంది ప్రవాసులకు నోటీసులు జారీ చేసింది. అధికారుల కథనం ప్రకారం.. చాలా మంది వ్యక్తులు KD 800 జీతం ఉందని, కుటుంబ వీసాలకు దరఖాస్తు చేసుకోగా.. వారికి అనమతి ఇచ్చారు. అయితే, వీసాలు పొందిన తర్వాత, వారు అధికారికంగా తక్కువ జీతాలను పొందారు. తద్వారా మంత్రివర్గ నిర్ణయం నిబంధనలను ఉల్లంఘించారని గుర్తించారు.
కుటుంబ వీసాలను పొందడానికి ఈ ప్రవాసులు KD 800 నెలవారీ ఆదాయాన్ని తెలిపే తప్పుడు సాలరీ సర్టిఫికేషన్ లను సమర్పించారని విచారణలో గుర్తించారు. కాగా, అధికారులు ఉల్లంఘించిన వారికి వారి నివాస స్థితిని సరిదిద్దుకోవడానికి లేదా వారి కుటుంబాలను స్వదేశానికి తిరిగి పంపించడానికి ఒక నెల గడువు ఇచ్చారు. సమన్లు పొందిన ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి ఉంటామని అధికారికంగా డిక్లరేషన్ పై సంతకం చేయాలని నిర్దేశించారు.
కుటుంబ పెద్ద తమ కుటుంబానికి మంచి జీవన ప్రమాణాలను అందించడానికి ఈ స్థాయి ఆదాయం అవసరమని సూచించే అధ్యయనాల ఆధారంగా KD 800 జీతం పరిమితిని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వివరించాయి. జాతీయత లేదా విద్యార్హతలతో సంబంధం లేకుండా, అందరూ ప్రవాసులు జీతం అవసరాలను తీర్చినట్లయితే, వారి కుటుంబాలను కువైట్కు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ అనుమతిస్తుందని స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









