ఫ్యామిలీ వీసా కోసం పే-స్లిప్ లో మానిపులేషన్..పలువురు ప్రవాసులకు నోటీసులు..!!
- May 29, 2025
కువైట్: కువైట్లో కుటుంబ వీసాలను నియంత్రించే నిబంధనలను ఉల్లంఘించినందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని నివాస వ్యవహారాల దర్యాప్తు విభాగం అనేక మంది ప్రవాసులకు నోటీసులు జారీ చేసింది. అధికారుల కథనం ప్రకారం.. చాలా మంది వ్యక్తులు KD 800 జీతం ఉందని, కుటుంబ వీసాలకు దరఖాస్తు చేసుకోగా.. వారికి అనమతి ఇచ్చారు. అయితే, వీసాలు పొందిన తర్వాత, వారు అధికారికంగా తక్కువ జీతాలను పొందారు. తద్వారా మంత్రివర్గ నిర్ణయం నిబంధనలను ఉల్లంఘించారని గుర్తించారు.
కుటుంబ వీసాలను పొందడానికి ఈ ప్రవాసులు KD 800 నెలవారీ ఆదాయాన్ని తెలిపే తప్పుడు సాలరీ సర్టిఫికేషన్ లను సమర్పించారని విచారణలో గుర్తించారు. కాగా, అధికారులు ఉల్లంఘించిన వారికి వారి నివాస స్థితిని సరిదిద్దుకోవడానికి లేదా వారి కుటుంబాలను స్వదేశానికి తిరిగి పంపించడానికి ఒక నెల గడువు ఇచ్చారు. సమన్లు పొందిన ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి ఉంటామని అధికారికంగా డిక్లరేషన్ పై సంతకం చేయాలని నిర్దేశించారు.
కుటుంబ పెద్ద తమ కుటుంబానికి మంచి జీవన ప్రమాణాలను అందించడానికి ఈ స్థాయి ఆదాయం అవసరమని సూచించే అధ్యయనాల ఆధారంగా KD 800 జీతం పరిమితిని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వివరించాయి. జాతీయత లేదా విద్యార్హతలతో సంబంధం లేకుండా, అందరూ ప్రవాసులు జీతం అవసరాలను తీర్చినట్లయితే, వారి కుటుంబాలను కువైట్కు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ అనుమతిస్తుందని స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!







