మిస్ వరల్డ్ 2025: నేడే హైటెక్స్ లో ఫైనల్
- May 31, 2025
హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ 2025 పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈసారి ఈ అంతర్జాతీయ సుందరీ పోటీకి హైదరాబాద్ గర్వంగా వేదికగా మారింది. హైటెక్స్లో ఇవాళ (మే 31) సాయంత్రం 6:30 నుంచి అర్ధరాత్రి వరకు ఫైనల్ పోటీలు జరుగనున్నాయి. విశ్వసుందరి కిరీటం కోసం నాలుగు ఖండాలకు చెందిన 40 మంది అందగత్తెలు ఒకరితో ఒకరు పోటీపడనున్నారు.
ఇండియా తరఫున నందినీ గుప్తా రేసులో
ఈ భారీ పోటీలో భారత్ తరఫున నందినీ గుప్తా గెలుపు కోసం బరిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా చాలామంది నందినీ విజయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందినీ ఇప్పటికే కొన్ని రౌండ్లలో తన ప్రతిభను చాటుతూ చాలా మంది జ్యూరీలను ఆకట్టుకున్నారు. మిస్ వరల్డ్ టైటిల్ భారత్కు రావాలని ఎంతో మంది ఆకాంక్షిస్తున్నారు.
ప్రపంచ ప్రతినిధులతో హైదరాబాద్ మెరిసిపోతోంది
ఈ మెగా ఈవెంట్కు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరాంగనులతో పాటు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, వ్యాపార రంగ ప్రతినిధులు హాజరుకానున్నారు.అంతర్జాతీయ మీడియా ఈ వేడుకను ప్రత్యేకంగా కవర్ చేస్తోంది. ప్రపంచ దృష్టి ప్రస్తుతం హైదరాబాద్పై ఉండడంతో రాష్ట్రానికి గ్లోబల్ స్థాయిలో గౌరవం కలగడం విశేషం.ఈ పోటీ ముగిసేలోపు కొత్త విశ్వసుందరిని ప్రకటించనుండగా, అందరూ ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..









