రష్యా పై యుక్రెయిన్ భీకర దాడులు..
- June 02, 2025
రష్యాపై యుక్రెయిన్ విరుచుకుపడింది. డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. రష్యాలోని 4 వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. యుక్రెయిన్ దాడుల్లో 40కిపైగా రష్యా బాంబర్ ప్లేన్ లు ధ్వంసం అయ్యాయి. తొలుత యుక్రెయిన్ సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా క్షిపణి దాడులు చేసింది. రష్యా జరిపిన దాడిలో 12మంది మృతి చెందారు. 60 మందికిపైగా గాయపడ్డాడు. యుక్రెయిన్ పై రష్యా ఏకంగా 472 డ్రోన్లను ప్రయోగించింది. కాగా రష్యా ప్రయోగించిన 385 డ్రోన్లను అడ్డుకున్నట్లు యుక్రెయిన్ తెలిపింది. రష్యా క్షిపణి దాడులతో యుక్రెయిన్ ప్రతీకార దాడులకు దిగింది.
రష్యాపై ఇంత భారీ మొత్తంలో యుక్రెయిన్ దాడులకు పాల్పడటం ఇదే తొలిసారి. తూర్పు సైబీరియా సరిహద్దులోని సైనిక స్థావరాలే లక్ష్యంగా సుదీర్ఘంగా ప్రయాణించ గలిగే డ్రోన్లను యుక్రెయిన్ ప్రయోగించింది. ఒలెన్యా, బెలయా సహా నాలుగు మిలటరీ ఎయిర్బేస్లపై దాడులు జరిగినట్లు రష్యా తెలిపింది.
తాము చేపట్టిన ఆపరేషన్లో 40కి పైగా రష్యన్ ఎయిర్క్రాఫ్ట్లు ధ్వంసమైనట్లు యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది. ఇందులో టీయూ-95, టీయూ-22ఎం3 బాంబర్లు, కీలకమైన ఏ-50 ఎయిర్ క్రాఫ్ట్ కూడా ధ్వంసమైనట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఇంత భారీ మొత్తంలో యుక్రెయిన్ దాడులకు తెగబడటం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









