షార్జాలో అరుదైన అరేబియన్ మచ్చల డేగ గుడ్లగూబ పిల్లలు..!!
- June 02, 2025
యూఏఈ: కల్బా బర్డ్స్ ఆఫ్ ప్రే సెంటర్లో మూడు అరేబియన్ స్పాటెడ్ ఈగిల్ గుడ్లగూబ పిల్లలు పొదిగినట్లు షార్జా పర్యావరణ, రక్షిత ప్రాంతాల అథారిటీ ప్రకటించింది. ఈ గుడ్లగూబ జాతిని మొదటిసారిగా 2003లో యూఏఈ లో గుర్తించారు. దిబ్బా పర్వతాల్లో దొరికిన వాటిని ఒక దాత దుబాయ్ జూకు బహుమతిగా అందజేశాడు.
ఇదే కుటుంబానికి చెందిన అరేబియన్ ఈగిల్ గుడ్లగూబ (బుబో ఆఫ్రికానస్ మిలేసి) మొదటిసారిగా 2017లో ఫుజైరాలోని హజర్ పర్వతాలలో కనుగొన్నారు. టెరెస్ట్రియల్ బయోడైవర్శిటీ మేనేజర్, సైంటిఫిక్ అడ్వైజర్ జాకీ జుడాస్ మాట్లాడుతూ.. ఇక్కడి ఎడారులు, పర్వత ప్రాంతాలలో అనేక రకాల వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక వినూత్నమైన జాతులు వృద్ధి చెందుతాయని అన్నారు. దురదృష్టవశాత్తు వేగవంతమైన అభివృద్ధి..ఈ జీవులలో చాలా వాటికి పెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న జాతులను రక్షించే ప్రయత్నాలను వేగవంతం చేసినట్టు తెలిపారు. 45 సెం.మీ ఎత్తు, 600 నుండి 800 గ్రాముల బరువున్న ఒక పెద్ద పక్షి ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







