ఒమన్లో ఔట్ డోర్ వర్క్ పై ఆంక్షలు ప్రారంభం..!!
- June 02, 2025
మస్కట్: వేసవి వేడి నుండి కార్మికులను రక్షించే చర్యలో భాగంగా, ఒమన్ అంతటా నిర్మాణ ప్రదేశాలు, ఇతర బహిరంగ పని ప్రదేశాలలో మధ్యాహ్నం పని నిషేధాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) అధికారికంగా అమలు చేసింది. అధిక ఉష్ణోగ్రతలకు గురయ్యే ప్రాంతాల్లో కార్మికులు మధ్యాహ్నం 12:30 నుండి 3:30 గంటల మధ్య పని చేయడాన్ని నిషేధించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45°C కంటే ఎక్కువగా పెరుగుతున్నందున కార్మికుల ఆరోగ్యం, భద్రతను కాపాడటం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఉల్లంఘించే కంపెనీలు OMR 500 నుండి OMR 1,000 వరకు జరిమానాలను ఎదుర్కొంటాయని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిబంధనల మేరకు నిర్మాణ కంపెనీలు షెడ్యూల్లను సర్దుబాటు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









