ఒమన్లో ఔట్ డోర్ వర్క్ పై ఆంక్షలు ప్రారంభం..!!
- June 02, 2025
మస్కట్: వేసవి వేడి నుండి కార్మికులను రక్షించే చర్యలో భాగంగా, ఒమన్ అంతటా నిర్మాణ ప్రదేశాలు, ఇతర బహిరంగ పని ప్రదేశాలలో మధ్యాహ్నం పని నిషేధాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) అధికారికంగా అమలు చేసింది. అధిక ఉష్ణోగ్రతలకు గురయ్యే ప్రాంతాల్లో కార్మికులు మధ్యాహ్నం 12:30 నుండి 3:30 గంటల మధ్య పని చేయడాన్ని నిషేధించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45°C కంటే ఎక్కువగా పెరుగుతున్నందున కార్మికుల ఆరోగ్యం, భద్రతను కాపాడటం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఉల్లంఘించే కంపెనీలు OMR 500 నుండి OMR 1,000 వరకు జరిమానాలను ఎదుర్కొంటాయని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిబంధనల మేరకు నిర్మాణ కంపెనీలు షెడ్యూల్లను సర్దుబాటు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం







