ఒమన్లో ఔట్ డోర్ వర్క్ పై ఆంక్షలు ప్రారంభం..!!
- June 02, 2025
మస్కట్: వేసవి వేడి నుండి కార్మికులను రక్షించే చర్యలో భాగంగా, ఒమన్ అంతటా నిర్మాణ ప్రదేశాలు, ఇతర బహిరంగ పని ప్రదేశాలలో మధ్యాహ్నం పని నిషేధాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) అధికారికంగా అమలు చేసింది. అధిక ఉష్ణోగ్రతలకు గురయ్యే ప్రాంతాల్లో కార్మికులు మధ్యాహ్నం 12:30 నుండి 3:30 గంటల మధ్య పని చేయడాన్ని నిషేధించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45°C కంటే ఎక్కువగా పెరుగుతున్నందున కార్మికుల ఆరోగ్యం, భద్రతను కాపాడటం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఉల్లంఘించే కంపెనీలు OMR 500 నుండి OMR 1,000 వరకు జరిమానాలను ఎదుర్కొంటాయని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిబంధనల మేరకు నిర్మాణ కంపెనీలు షెడ్యూల్లను సర్దుబాటు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









