అల్-రెగ్గైలోని అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం...ఐదుకు పెరిగిన మృతుల సంఖ్య..!!
- June 02, 2025
కువైట్: ఆదివారం తెల్లవారుజామున రెగ్గై ప్రాంతంలో జరిగిన ఒక అపార్ట్మెంట్ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు పెరిగిందని అధికారులు తెలిపారు.మృతులందరూ సూడాన్ జాతీయులుగా తెలుస్తుంది. కాగా, ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. షువైఖ్ ఇండస్ట్రియల్, అర్దియా సెంటర్ల నుండి వచ్చిన అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.మొదటగా ఒక అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి, త్వరగా అవి పక్క ప్రాంతాలకు వ్యాపించాయి.ఈ ప్రమాదంపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, భవనంలో ఎక్కువ మంది అద్దెదారులు ఆఫ్రికన్, ఆసియా జాతీయులు.మరోవైపు, జనరల్ ఫైర్ ఫోర్స్ భవనాలు, ఇతర సౌకర్యాల యజమానులు అన్ని భద్రత, అగ్ని నిరోధక నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!







