భారత్ లో కరోనా విజృంభణ.. వేగంగా పెరుగుతున్న కొత్త కేసులు..
- June 03, 2025
న్యూ ఢిల్లీ: భారత దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కోవిడ్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4026 కాగా.. 2700 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా కేరళలో 1416 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 494, ఢిల్లీ 393, కర్ణాటక 311, గుజరాత్ 397, తమిళనాడులో 215, వెస్ట్ బెంగాల్ 372, ఉత్తరప్రదేశ్ 138, ఆంధ్రప్రదేశ్ 28, తెలంగాణలో నాలుగు కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఐదుగురు కోవిడ్ కారణంగా మరణించగా.. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కొవిడ్ వైరస్ వల్ల 37మరణించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాయి. కర్నూల్ జిల్లాలోనూ కరోనా కేసు నమోదైంది. ఒకరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. ఎమ్మిగనూరు మండలం కల్లుగోట్లు గ్రామానికి చెందిన 65ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ గా గుర్తించారు. ప్రభుత్వ సర్వజన వైద్య శాలలో చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ కేసు నమోదు కావడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- UAE President receives Professor Humaid Al Shamsi
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!