ఇండియా, చైనీస్ శానిటరీ వేర్పై 83.4% యాంటి డంపింగ్ డ్యూటీ..!!
- June 04, 2025
కువైట్: ఇండియా, చైనా నుండి వచ్చే శానిటరీ వేర్ దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధిస్తూ కువైట్ కస్టమ్స్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఫాతిమా అల్ కల్లాఫ్ కొత్త కస్టమ్స్ ఉత్తర్వులను జారీ చేశారు. కొత్త టారిఫ్ రేట్లు 21.4% నుండి 83.4% వరకు ఉంటాయని తెలిపింది.
2025 కస్టమ్స్ ఇన్స్ట్రక్షన్ నంబర్ 25 కింద జారీ చేయబడిన ఈ ఉత్తర్వులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల ద్వారా కువైట్లోకి ప్రవేశించే దిగుమతులకు వర్తిస్తుంది. ఇది ప్రత్యేకంగా వాష్బేసిన్లు, బాత్టబ్లు, బిడెట్లు, టాయిలెట్ సీట్లు, ఫ్లష్ ట్యాంకులు, యూరినల్స్, పింగాణీతో తయారు చేసిన ఇలాంటి స్థిర శానిటరీ వస్తువులు వంటి ఉత్పత్తులు ఈ టారిఫ్ కింద ఉన్నాయి.
ప్రస్తుత కస్టమ్స్ సుంకాలకు అదనంగా యాంటీ-డంపింగ్ సుంకాలు విధించబడతాయి. వస్తువుల CIF (ఖర్చు, భీమా, సరుకు రవాణా) విలువ ఆధారంగా లెక్కిస్తారు. దర్యాప్తులో గుర్తించబడిన డంపింగ్ మార్జిన్లు చైనా కంపెనీలకు 33.8% నుండి 51% వరకు, భారతీయ కంపెనీలకు 21.4% నుండి 83.4% వరకు ఉంటాయని తెలిపారు. కువైట్ తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సుంకాలు జూలై 8 నుండి ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







