ఇండియా, చైనీస్ శానిటరీ వేర్పై 83.4% యాంటి డంపింగ్ డ్యూటీ..!!
- June 04, 2025
కువైట్: ఇండియా, చైనా నుండి వచ్చే శానిటరీ వేర్ దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధిస్తూ కువైట్ కస్టమ్స్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఫాతిమా అల్ కల్లాఫ్ కొత్త కస్టమ్స్ ఉత్తర్వులను జారీ చేశారు. కొత్త టారిఫ్ రేట్లు 21.4% నుండి 83.4% వరకు ఉంటాయని తెలిపింది.
2025 కస్టమ్స్ ఇన్స్ట్రక్షన్ నంబర్ 25 కింద జారీ చేయబడిన ఈ ఉత్తర్వులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల ద్వారా కువైట్లోకి ప్రవేశించే దిగుమతులకు వర్తిస్తుంది. ఇది ప్రత్యేకంగా వాష్బేసిన్లు, బాత్టబ్లు, బిడెట్లు, టాయిలెట్ సీట్లు, ఫ్లష్ ట్యాంకులు, యూరినల్స్, పింగాణీతో తయారు చేసిన ఇలాంటి స్థిర శానిటరీ వస్తువులు వంటి ఉత్పత్తులు ఈ టారిఫ్ కింద ఉన్నాయి.
ప్రస్తుత కస్టమ్స్ సుంకాలకు అదనంగా యాంటీ-డంపింగ్ సుంకాలు విధించబడతాయి. వస్తువుల CIF (ఖర్చు, భీమా, సరుకు రవాణా) విలువ ఆధారంగా లెక్కిస్తారు. దర్యాప్తులో గుర్తించబడిన డంపింగ్ మార్జిన్లు చైనా కంపెనీలకు 33.8% నుండి 51% వరకు, భారతీయ కంపెనీలకు 21.4% నుండి 83.4% వరకు ఉంటాయని తెలిపారు. కువైట్ తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సుంకాలు జూలై 8 నుండి ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









