ఇండియా, చైనీస్ శానిటరీ వేర్పై 83.4% యాంటి డంపింగ్ డ్యూటీ..!!
- June 04, 2025
కువైట్: ఇండియా, చైనా నుండి వచ్చే శానిటరీ వేర్ దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధిస్తూ కువైట్ కస్టమ్స్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఫాతిమా అల్ కల్లాఫ్ కొత్త కస్టమ్స్ ఉత్తర్వులను జారీ చేశారు. కొత్త టారిఫ్ రేట్లు 21.4% నుండి 83.4% వరకు ఉంటాయని తెలిపింది.
2025 కస్టమ్స్ ఇన్స్ట్రక్షన్ నంబర్ 25 కింద జారీ చేయబడిన ఈ ఉత్తర్వులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల ద్వారా కువైట్లోకి ప్రవేశించే దిగుమతులకు వర్తిస్తుంది. ఇది ప్రత్యేకంగా వాష్బేసిన్లు, బాత్టబ్లు, బిడెట్లు, టాయిలెట్ సీట్లు, ఫ్లష్ ట్యాంకులు, యూరినల్స్, పింగాణీతో తయారు చేసిన ఇలాంటి స్థిర శానిటరీ వస్తువులు వంటి ఉత్పత్తులు ఈ టారిఫ్ కింద ఉన్నాయి.
ప్రస్తుత కస్టమ్స్ సుంకాలకు అదనంగా యాంటీ-డంపింగ్ సుంకాలు విధించబడతాయి. వస్తువుల CIF (ఖర్చు, భీమా, సరుకు రవాణా) విలువ ఆధారంగా లెక్కిస్తారు. దర్యాప్తులో గుర్తించబడిన డంపింగ్ మార్జిన్లు చైనా కంపెనీలకు 33.8% నుండి 51% వరకు, భారతీయ కంపెనీలకు 21.4% నుండి 83.4% వరకు ఉంటాయని తెలిపారు. కువైట్ తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సుంకాలు జూలై 8 నుండి ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







