ఇండియా, చైనీస్ శానిటరీ వేర్పై 83.4% యాంటి డంపింగ్ డ్యూటీ..!!
- June 04, 2025
కువైట్: ఇండియా, చైనా నుండి వచ్చే శానిటరీ వేర్ దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధిస్తూ కువైట్ కస్టమ్స్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఫాతిమా అల్ కల్లాఫ్ కొత్త కస్టమ్స్ ఉత్తర్వులను జారీ చేశారు. కొత్త టారిఫ్ రేట్లు 21.4% నుండి 83.4% వరకు ఉంటాయని తెలిపింది.
2025 కస్టమ్స్ ఇన్స్ట్రక్షన్ నంబర్ 25 కింద జారీ చేయబడిన ఈ ఉత్తర్వులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల ద్వారా కువైట్లోకి ప్రవేశించే దిగుమతులకు వర్తిస్తుంది. ఇది ప్రత్యేకంగా వాష్బేసిన్లు, బాత్టబ్లు, బిడెట్లు, టాయిలెట్ సీట్లు, ఫ్లష్ ట్యాంకులు, యూరినల్స్, పింగాణీతో తయారు చేసిన ఇలాంటి స్థిర శానిటరీ వస్తువులు వంటి ఉత్పత్తులు ఈ టారిఫ్ కింద ఉన్నాయి.
ప్రస్తుత కస్టమ్స్ సుంకాలకు అదనంగా యాంటీ-డంపింగ్ సుంకాలు విధించబడతాయి. వస్తువుల CIF (ఖర్చు, భీమా, సరుకు రవాణా) విలువ ఆధారంగా లెక్కిస్తారు. దర్యాప్తులో గుర్తించబడిన డంపింగ్ మార్జిన్లు చైనా కంపెనీలకు 33.8% నుండి 51% వరకు, భారతీయ కంపెనీలకు 21.4% నుండి 83.4% వరకు ఉంటాయని తెలిపారు. కువైట్ తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సుంకాలు జూలై 8 నుండి ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!







