సగ్గుబియ్యం దోశ

- July 12, 2016 , by Maagulf
సగ్గుబియ్యం దోశ

కావలసినవి:
సగ్గుబియ్యం ఒక కప్పు బియ్యం అర కప్పు పచ్చిమిర్చి 2 అల్లం చిన్న ముక్క ఉప్పు తగినంత
విధానం:
సగ్గుబియ్యం, బియ్యం కలిపి 6 గంటలు నానబెట్టండి. నీరు వంపేసి మిర్చి, అల్లం తో బాటు కలిపి పిండి పట్టండి. గిన్నెలోకి తీసుకుని ఉప్పు వేసి నీళ్ళు కలుపుకోండి. ఈ పిండి పల్చగా ఉంటేనే బావుంటుంది. పెనం పై బయట నుండి లోపలికి (మైదా దోశెల్లగా) దోశెలుగా పొయ్యండి. రెండు వైపుల కాల్చి తీయండి.సగ్గుబియ్యం దోశ పిల్లలు ఇష్టపడతారు. వేడి వేడిగా చాలా బావుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com