మృత్యుంజయుడు విశ్వాశ్ కుమార్ ను ప్రత్యేకంగా కలిసిన ప్రధాని మోదీ
- June 13, 2025
అహ్మదాబాద్: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లో జరిగిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ కూల్చిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్పందన రేకెత్తించింది. 241 మంది మృతి, ఒకే ఒక్కరి ప్రాణాలు పరిరక్షితమవడం–ఇది స్వతంత్ర భారత విమాన చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటనగా నమోదైంది.కేవలం ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ల ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ, నేరుగా మేఘానీనగర్లోని ప్రమాద స్థలానికి వెళ్లారు. ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. అనంతరం, ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాశ్ కుమార్ రమేశ్ను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
“అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇది మాటలకు అందని విషాదం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వం బాధితులకు సకాలంలో అవసరమైన సాయం అందించేందుకు కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు. ఈ ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎక్స్ వేదికగా నిన్న మోదీ పేర్కొన్నారు.
ఈ విమాన ప్రమాదం విషాదం నింపినప్పటికీ, విశ్వాశ్ కుమార్ రమేశ్ ప్రాణాలతో బయటపడటం ఆశాజనక విషయంగా మారింది. ప్రధానమంత్రి మోదీ ఆయనను వ్యక్తిగతంగా పరామర్శించి ధైర్యం చెప్పిన చర్య దేశ ప్రజలను భావోద్వేగానికి గురిచేసింది. ఈ ఘటన పైత్యం, బాధతో పాటు భద్రతా ప్రమాణాల పునఃసమీక్ష అవసరాన్ని కూడా ఋజువు చేస్తోంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







