సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- June 13, 2025
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ సౌదీ ప్రాంతాలైన తబుక్, జాజాన్, అసిర్, నజ్రాన్, మక్కా, మదీనా, తూర్పు ప్రావిన్స్ అంతటా ప్రధాన మాదకద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా 2,756,806 యాంఫేటమిన్ పిల్స్ , నాలుగు టన్నుల హషీష్, 180 టన్నుల ఖాట్ స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి 2,411 మంది వ్యక్తులను అరెస్టు చేశారని, వారిలో 1,518 మంది ఇథియోపియన్ జాతీయులు; 842 మంది యెమెన్లు; ఏడుగురు సూడాన్లు; ఆరుగురు ఎరిట్రియన్లు; ముగ్గురు సోమాలిలు; ఇద్దరు పాకిస్తానీలు, 33 మంది సౌదీ పౌరులు ఉన్నారని వెల్లడించారు. ఇది అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాదకద్రవ్యాల వ్యతిరేక మిషన్లో భాగంగా..యువత భద్రతను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసినట్లు తెలిపింది. ఏదైనా సమాచారాన్ని మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్లోని 911 నంబర్కు లేదా ఇతర ప్రాంతాలలో 999 నంబర్కు కాల్ చేయడం ద్వారా అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ నంబర్ 994, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ నంబర్ 995 లేదా [email protected] కు ఇమెయిల్ చేయడం ద్వారా తెలియజేయాలని సూచించింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా పెడతామని తెలిపింది.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







