సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- June 13, 2025
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ సౌదీ ప్రాంతాలైన తబుక్, జాజాన్, అసిర్, నజ్రాన్, మక్కా, మదీనా, తూర్పు ప్రావిన్స్ అంతటా ప్రధాన మాదకద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా 2,756,806 యాంఫేటమిన్ పిల్స్ , నాలుగు టన్నుల హషీష్, 180 టన్నుల ఖాట్ స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి 2,411 మంది వ్యక్తులను అరెస్టు చేశారని, వారిలో 1,518 మంది ఇథియోపియన్ జాతీయులు; 842 మంది యెమెన్లు; ఏడుగురు సూడాన్లు; ఆరుగురు ఎరిట్రియన్లు; ముగ్గురు సోమాలిలు; ఇద్దరు పాకిస్తానీలు, 33 మంది సౌదీ పౌరులు ఉన్నారని వెల్లడించారు. ఇది అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాదకద్రవ్యాల వ్యతిరేక మిషన్లో భాగంగా..యువత భద్రతను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసినట్లు తెలిపింది. ఏదైనా సమాచారాన్ని మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్లోని 911 నంబర్కు లేదా ఇతర ప్రాంతాలలో 999 నంబర్కు కాల్ చేయడం ద్వారా అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ నంబర్ 994, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ నంబర్ 995 లేదా [email protected] కు ఇమెయిల్ చేయడం ద్వారా తెలియజేయాలని సూచించింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా పెడతామని తెలిపింది.
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్









