సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- June 13, 2025
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ సౌదీ ప్రాంతాలైన తబుక్, జాజాన్, అసిర్, నజ్రాన్, మక్కా, మదీనా, తూర్పు ప్రావిన్స్ అంతటా ప్రధాన మాదకద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా 2,756,806 యాంఫేటమిన్ పిల్స్ , నాలుగు టన్నుల హషీష్, 180 టన్నుల ఖాట్ స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి 2,411 మంది వ్యక్తులను అరెస్టు చేశారని, వారిలో 1,518 మంది ఇథియోపియన్ జాతీయులు; 842 మంది యెమెన్లు; ఏడుగురు సూడాన్లు; ఆరుగురు ఎరిట్రియన్లు; ముగ్గురు సోమాలిలు; ఇద్దరు పాకిస్తానీలు, 33 మంది సౌదీ పౌరులు ఉన్నారని వెల్లడించారు. ఇది అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాదకద్రవ్యాల వ్యతిరేక మిషన్లో భాగంగా..యువత భద్రతను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసినట్లు తెలిపింది. ఏదైనా సమాచారాన్ని మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్లోని 911 నంబర్కు లేదా ఇతర ప్రాంతాలలో 999 నంబర్కు కాల్ చేయడం ద్వారా అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ నంబర్ 994, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ నంబర్ 995 లేదా [email protected] కు ఇమెయిల్ చేయడం ద్వారా తెలియజేయాలని సూచించింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా పెడతామని తెలిపింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!