ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- June 13, 2025
హైదరాబాద్: ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16వ తేది ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆ నోటీస్ లో పేర్కొన్నారు.కాగా, ఇప్పటికే ఒకసారి ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను విడివిడిగా విచారించారు. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అప్పుడే చెప్పారు. అయితే ఇటీవలే ఎసిబి కెటిఆర్ కు విచారణకు రావాల్సిందిగా నోటీస్ పంపింది.. ఈ సందర్భంగా ఈ నోటీస్ కు కెటిఆర్ జవాబిస్తూ విదేశాలలో ముందస్తు కార్యక్రమాలు ఉండటంతో విచారణకు రాలేకపోతున్నానని వివరించారు.. మరో తేదిని కేటాయించవలసిందిగా కోరారు..ఈ నేపథ్యంలో నేడు కొత్తగా నోటీస్ జారీ చేసింది ఎసిబి.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!