ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట…త్రిసభ్య కమిటీ ఏర్పాటు!
- June 15, 2025
ముంబై: ఆర్సీబీ విజయం సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది.భవిష్యత్లో ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు మరొకసారి చోటు చేసుకోకుండా ఉండేందుకు, ఐపీఎల్ కార్యక్రమాల సమయంలో భద్రతా చర్యలను మెరుగుపరిచేందుకు బోర్డు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో, అవసరమైన భద్రతా మార్గదర్శకాలను రూపొందించేందుకు బీసీసీఐ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ప్రభ్ తేజ్ సింగ్ భాటియా సభ్యులుగా ఉన్నారు.
ఈ ఘటనపై బోర్డు ఒక ప్రకటన విడుదల చేస్తూ, “బెంగళూరులో జరిగిన తొక్కిసలాట అత్యంత దురదృష్టకరం.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం.అందుకే కమిటీ ఏర్పాటుచేశాం.త్వరలోనే కమిటీ తగిన భద్రతా మార్గదర్శకాలను విడుదల చేస్తుంది” అని పేర్కొంది.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







