ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట…త్రిసభ్య కమిటీ ఏర్పాటు!
- June 15, 2025
ముంబై: ఆర్సీబీ విజయం సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది.భవిష్యత్లో ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు మరొకసారి చోటు చేసుకోకుండా ఉండేందుకు, ఐపీఎల్ కార్యక్రమాల సమయంలో భద్రతా చర్యలను మెరుగుపరిచేందుకు బోర్డు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో, అవసరమైన భద్రతా మార్గదర్శకాలను రూపొందించేందుకు బీసీసీఐ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ప్రభ్ తేజ్ సింగ్ భాటియా సభ్యులుగా ఉన్నారు.
ఈ ఘటనపై బోర్డు ఒక ప్రకటన విడుదల చేస్తూ, “బెంగళూరులో జరిగిన తొక్కిసలాట అత్యంత దురదృష్టకరం.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం.అందుకే కమిటీ ఏర్పాటుచేశాం.త్వరలోనే కమిటీ తగిన భద్రతా మార్గదర్శకాలను విడుదల చేస్తుంది” అని పేర్కొంది.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







