భారత ప్రధానికి లెటర్ రాసిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- June 15, 2025
జెడ్డా: భారత్ లో జరిగిన విషాదకర విమాన ప్రమాదంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సంతాపం తెలిపారు. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒక కేబుల్ పంపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలకు క్రౌన్ ప్రిన్స్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.
జూన్ 12( గురువారం) అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ కు బయలు దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లకే సమీపంలోని మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలింది. విమానంలో ఉన్న 241 మందితోపాటు భవనం సమీపంలోని 29 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఒకే ఒక ప్రయాణీకుడు గాయాలతో బయటపడటం గమనార్హం.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









