భారత ప్రధానికి లెటర్ రాసిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!

- June 15, 2025 , by Maagulf
భారత ప్రధానికి లెటర్ రాసిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!

జెడ్డా: భారత్ లో జరిగిన విషాదకర విమాన ప్రమాదంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సంతాపం తెలిపారు. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒక కేబుల్ పంపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలకు క్రౌన్ ప్రిన్స్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.

జూన్ 12( గురువారం) అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ కు బయలు దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లకే సమీపంలోని మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలింది. విమానంలో ఉన్న 241 మందితోపాటు భవనం సమీపంలోని 29 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఒకే ఒక ప్రయాణీకుడు గాయాలతో బయటపడటం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com