ఒమన్ లో ఉపాధి, క్రీడలు, టూరిజంపై ప్రజాభిప్రాయ సేకరణ..!!
- June 15, 2025
మస్కట్: ఉపాధి, సామాజిక రక్షణ, క్రీడలు, వినోదంపై దృష్టి సారించి.. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) నేటి నుంచి ప్రజాభిప్రాయ సర్వేను ప్రారంభించనుంది. సామాజిక వాస్తవాలను ప్రతిబింబించేలా విధాన నిర్ణయం తీసుకునే ప్రక్రియలకు మద్దతు ఇచ్చే ఖచ్చితమైన డేటాను రూపొందించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా చేపడుతున్న ఈ సర్వే జూన్ 25 వరకు కొనసాగుతుందని తెలిపారు.
కార్మిక రంగంపై ఒమానీల అభిప్రాయాలను అంచనా వేయడం, క్రీడా భాగస్వామ్యం, వినోద కార్యకలాపాలలో ధోరణులను పర్యవేక్షించడం ఈ సర్వే లక్ష్యం అని NCSIలోని సమాచార నివేదికల విభాగం డైరెక్టర్ సాదా బింట్ అబ్దుల్లా అల్-మావాలి పేర్కొన్నారు. అలాగే సుల్తానేట్ గవర్నరేట్ల అంతటా పర్యాటక సేవలతో ప్రజల సంతృప్తిని అంచనా వేయడానికి కూడా సర్వే చేస్తున్నామని తెలిపారు. ఈ సర్వేలో భాగంగా 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల ఒమానీ పౌరుల నుంచి అభిప్రాయలను సేకరించనున్నారు. అందరూ పాల్గొనాలని, తమ అభిప్రాయాలను నిష్పాక్షికంగా పంచుకోవాలని పిలుపునిచ్చారు. వారి ఇన్పుట్ ప్రజలకు అందించే సేవలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి నేరుగా దోహదపడుతుందని తెలిపారు.
కాగా, రాయల్ డిక్రీ నంబర్ 55/2019 ప్రకారం.. సేకరించిన సమాచారాన్ని గోప్యతతో పరిగణిస్తామని అల్-మావలి పునరుద్ఘాటించారు. డిక్రీలోని ఆర్టికల్ (11) ప్రకారం.. వ్యక్తిగత గణాంక డేటా గోప్యంగా ఉంటుందని, సమగ్ర అభివృద్ధి ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









