బ్యాంకు వివరాల చోరీ..నకిలీ లింక్లను పంపుతున్న ముఠా అరెస్టు..!!
- June 15, 2025
దుబాయ్: నకిలీ లింక్ల ద్వారా బాధితులను ఆకర్షించి, మోసం చేస్తున్న ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెస్టారెంట్లు, డెలివరీ కంపెనీలు వంటి ప్రసిద్ధ సంస్థల పేరుతో మోసాలకు ముఠా సభ్యులు పాల్పడుతున్నారని దుబాయ్ పోలీసులు తెలిపారు. విశ్వసనీయ కంపెనీల నుండి వచ్చినట్లు కనిపించే SMSలు, ఇమెయిల్లు, ఆన్లైన్ లింక్లను పంపడం ద్వారా సైబర్ నేరస్థులు బాధితుల నుంచి బ్యాంకు వివరాలను చోరీ చేస్తుంటారు. బాధితులను నమ్మించేందుకు స్కామర్లు ప్రముఖ సంస్థల పేర్లను ఉపయోగించుకున్నారని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. “ఒక బాధితుడు లింక్పై క్లిక్ చేసి వారి బ్యాంకింగ్ సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, ముఠా నిధులను ఉపసంహరించుకోవడానికి ఆ డేటాను ఉపయోగిస్తుంది” అని వారు తెలిపారు.
దుబాయ్ పోలీస్ యాంటీ-ఫ్రాడ్ సెంటర్ నుండి ప్రత్యేక బృందాలు ముఠాను ట్రేస్ చేయడానికి పనిచేశాయి. ఈ మోసపూరిత సందేశాలను విశ్లేషించి, అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేశాయి. ముఠా సభ్యులను గుర్తించి అరెస్టు చేసి వారివద్ద నుంచి ఎలక్ట్రానిక్ సాధనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్ లో వచ్చే లింక్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింక్లను సమీపంలోని పోలీస్ స్టేషన్లో లేదా దుబాయ్ పోలీస్ యాప్, eCrime ప్లాట్ఫారమ్లోని 'పోలీస్ ఐ' ఫీచర్ ద్వారా నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









