పెట్రోల్ బంకులో గొడవ..ఇద్దరు వ్యక్తులు మృతి.. 11 మంది అరెస్టు..!!

- June 15, 2025 , by Maagulf
పెట్రోల్ బంకులో గొడవ..ఇద్దరు వ్యక్తులు మృతి.. 11 మంది అరెస్టు..!!

దుబాయ్: ఏప్రిల్‌లో దుబాయ్‌లోని ఒక పెట్రోల్ బంకులో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు ఉజ్బెక్ జాతీయులు ప్రాణాలు కోల్పోయిన కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేస్తోంది. పాత విభేదాల ఫలితంగా ఈ ఘర్షణ జరిగిందని, బాధితులు తమ వాహనం టైర్లకు గాలి నింపడానికి వచ్చినప్పుడు వివాదం తలెత్తిందని తెలిపారు. సమీపంలో ఉన్న ఒక పోలీసు అధికారి ఈ సంఘటనను గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. ప్రాథమిక దర్యాప్తులో రెండు గ్రూపులు వేర్వేరు వాహనాల్లో స్టేషన్‌కు వచ్చాయని తేలింది. బాధితుల్లో ఒకరు టైర్లను తనిఖీ చేయడానికి ఎరుపు రంగు మెర్సిడెస్ నుండి దిగగానే కొంతమంది వ్యక్తులు అతని దగ్గరికి వచ్చి దాడి చేశారు. అదే సమయంలో రెండవ బాధితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ కొద్దిసేపటికే మరొక గుంపు అతన్ని పట్టుకుని దాడి చేసింది.  

CCTV ద్వారా గుర్తింపు

దుబాయ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడి నుండి సాక్ష్యాలను సేకరించారు.  CCTV ఫుటేజ్ తోపాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు.   పోలీసులు ప్రాథమిక అనుమానితులతో సహా ఇందులో పాల్గొన్న 11 మందిని మరొక ఎమిరేట్‌లోని ఒక హోటల్‌లో అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు.  తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్లు తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com