బహ్రెయిన్ లో కీలక విద్యుత్ ప్రాజెక్టుకు కింగ్ హమద్ ఆమోదం..!!
- June 16, 2025
మనామా: ప్రధాన విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుకు బహ్రెయిన్ ఆమోదంతెలిపింది. ఈ మేరకు 2025 నాటి చట్టం నంబర్ (26)ను రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అధికారికంగా ఆమోదించారు. ఇది కొత్త విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడానికి ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ (IsDB)తో బహ్రెయిన్ ఒప్పందానికి తాజాగా ఆమోదముద్ర వేశారు.
షురా కౌన్సిల్, ప్రతినిధుల మండలి రెండింటిచే ఆమోదించబడిన ఈ చట్టం.. 400 కిలోవోల్ట్లతో పనిచేసే కొత్త జస్రా విద్యుత్ కేంద్రం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ ఒప్పందంలో ఫ్రేమ్వర్క్ ఒప్పందం, ఏజెన్సీ ఒప్పందంతోపాటు బహ్రెయిన్ ప్రభుత్వం, IsDB మధ్య హామీ ఒప్పందం ఉన్నాయి. ఈ ఒప్పందాలపై మొదటగా సెప్టెంబర్ 9, 2024న సంతకాలు జరిగాయి.
కొత్త విద్యుత్ కేంద్రం దేశంలోని విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుందని, పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంలో సహాయపడుతుందని, భవిష్యత్తు అభివృద్ధికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. చట్టం ప్రకారం.. ఒప్పందాలను అమలు చేయడానికి అవసరమైన చర్యలను చేపట్టే బాధ్యత ప్రధానమంత్రి, సంబంధిత మంత్రులకు ఉంది. ఈ చట్టం అధికారిక గెజిట్లో ప్రచురించబడిన మరుసటి రోజు నుండి అమలులోకి వస్తుందని అధికార వర్గులు తెలిపాయి.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







