బహ్రెయిన్ లో కీలక విద్యుత్ ప్రాజెక్టుకు కింగ్ హమద్ ఆమోదం..!!
- June 16, 2025
మనామా: ప్రధాన విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుకు బహ్రెయిన్ ఆమోదంతెలిపింది. ఈ మేరకు 2025 నాటి చట్టం నంబర్ (26)ను రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అధికారికంగా ఆమోదించారు. ఇది కొత్త విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడానికి ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ (IsDB)తో బహ్రెయిన్ ఒప్పందానికి తాజాగా ఆమోదముద్ర వేశారు.
షురా కౌన్సిల్, ప్రతినిధుల మండలి రెండింటిచే ఆమోదించబడిన ఈ చట్టం.. 400 కిలోవోల్ట్లతో పనిచేసే కొత్త జస్రా విద్యుత్ కేంద్రం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ ఒప్పందంలో ఫ్రేమ్వర్క్ ఒప్పందం, ఏజెన్సీ ఒప్పందంతోపాటు బహ్రెయిన్ ప్రభుత్వం, IsDB మధ్య హామీ ఒప్పందం ఉన్నాయి. ఈ ఒప్పందాలపై మొదటగా సెప్టెంబర్ 9, 2024న సంతకాలు జరిగాయి.
కొత్త విద్యుత్ కేంద్రం దేశంలోని విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుందని, పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంలో సహాయపడుతుందని, భవిష్యత్తు అభివృద్ధికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. చట్టం ప్రకారం.. ఒప్పందాలను అమలు చేయడానికి అవసరమైన చర్యలను చేపట్టే బాధ్యత ప్రధానమంత్రి, సంబంధిత మంత్రులకు ఉంది. ఈ చట్టం అధికారిక గెజిట్లో ప్రచురించబడిన మరుసటి రోజు నుండి అమలులోకి వస్తుందని అధికార వర్గులు తెలిపాయి.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









