ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఇస్లామిక్ నూతన సంవత్సర సెలవు ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం
- June 16, 2025
అబుదాబి: యూఏఈ ప్రభుత్వం ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ సంవత్సరం 1447) సందర్భంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జూన్ 27 (శుక్రవారం) వేతనాలతో కూడిన సెలవు ప్రకటించింది.
శనివారం సెలవు ఉండే కొందరు ఉద్యోగులకు జూన్ 27 నుంచి జూన్ 29 వరకు మొత్తం 3 రోజుల పాటు సెలవు కలుగనుందని అధికారులు తెలిపారు. జూన్ 30 (సోమవారం) నుంచి సాధారణ పనులు పునఃప్రారంభం అవుతాయి.
ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కూడా ఇది వర్తించనుందని అధికారులు స్పష్టం చేశారు. ఏకరీతి సెలవు విధానం కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేసే ప్రతి ఒక్కరు సమానంగా సెలవు పొందుతారు.
జూన్ ప్రారంభంలో ఈద్ అల్ అద్హా సందర్భంగా చేసిన విస్తృత సెలవులకు తోడుగా ఇప్పుడు హిజ్రీ నూతన సంవత్సరాన్ని జరుపుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









