శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- October 16, 2025
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్లో DRI అధికారులు మరోసారి చాకచక్యంగా బంగారం అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కువైట్ నుంచి షార్జా మార్గం ద్వారా వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా, అతని వద్ద 1.8 కిలోల బంగారం దొరికింది. బంగారం మొత్తం 7 కడ్డీల రూపంలో ఉండగా, మార్కెట్ విలువ సుమారు ₹2.37 కోట్లు అని అధికారులు తెలిపారు.నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.
ఇటీవలి నెలల్లో బంగారం ధరలు లక్షా 30 వేల రూపాయల వరకు పెరగడంతో, అక్రమ రవాణా ఘటనలు మరింత పెరిగాయి. చోరీలు, చైన్స్నాచింగ్లతో పాటు అంతర్జాతీయ రవాణా మార్గాల ద్వారా బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో DRI అధికారులు విమానాశ్రయాల్లో నిరంతర తనిఖీలు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







