శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- October 16, 2025
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్లో DRI అధికారులు మరోసారి చాకచక్యంగా బంగారం అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కువైట్ నుంచి షార్జా మార్గం ద్వారా వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా, అతని వద్ద 1.8 కిలోల బంగారం దొరికింది. బంగారం మొత్తం 7 కడ్డీల రూపంలో ఉండగా, మార్కెట్ విలువ సుమారు ₹2.37 కోట్లు అని అధికారులు తెలిపారు.నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.
ఇటీవలి నెలల్లో బంగారం ధరలు లక్షా 30 వేల రూపాయల వరకు పెరగడంతో, అక్రమ రవాణా ఘటనలు మరింత పెరిగాయి. చోరీలు, చైన్స్నాచింగ్లతో పాటు అంతర్జాతీయ రవాణా మార్గాల ద్వారా బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో DRI అధికారులు విమానాశ్రయాల్లో నిరంతర తనిఖీలు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!