శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- October 16, 2025
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్లో DRI అధికారులు మరోసారి చాకచక్యంగా బంగారం అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కువైట్ నుంచి షార్జా మార్గం ద్వారా వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా, అతని వద్ద 1.8 కిలోల బంగారం దొరికింది. బంగారం మొత్తం 7 కడ్డీల రూపంలో ఉండగా, మార్కెట్ విలువ సుమారు ₹2.37 కోట్లు అని అధికారులు తెలిపారు.నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.
ఇటీవలి నెలల్లో బంగారం ధరలు లక్షా 30 వేల రూపాయల వరకు పెరగడంతో, అక్రమ రవాణా ఘటనలు మరింత పెరిగాయి. చోరీలు, చైన్స్నాచింగ్లతో పాటు అంతర్జాతీయ రవాణా మార్గాల ద్వారా బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో DRI అధికారులు విమానాశ్రయాల్లో నిరంతర తనిఖీలు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









