రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- October 16, 2025
హైదరాబాద్: డా. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 94వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాధిక తుమ్మలకి లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానం చేయబడింది.
ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జీ అందజేశారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, విద్యార్థులలో విలువలతో కూడిన విద్యను నూరిపోస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు ఈ పురస్కారం రాధిక తుమ్మలకి లభించింది.
కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొన్నారు.డా.కలామ్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని యువతకు ప్రేరణగా నిలవాలని రాధిక తుమ్మల ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!