GCC టూరిస్ట్ వీసాకు త్వరలో ఆమోదం..!!
- June 17, 2025
యూఏఈః GCC సింగిల్ టూరిస్ట్ వీసాకు ఆమోదం లభించిందని, త్వరలో అమలు చేయబడుతుందని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి అన్నారు. యూఏఈ హాస్పిటాలిటీ సమ్మర్ క్యాంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలు గత కొన్ని సంవత్సరాలుగా స్కెంజెన్ టూరిస్ట్ వీసా మాదిరిగానే ఈ ప్రాంతానికి ఏకీకృత టూరిస్ట్ వీసా లేదా GCC గ్రాండ్ టూర్స్ వీసాను విడుదల చేయడం గురించి చర్చిస్తున్నాయి. ఈ వీసా ద్వారా విదేశీ పర్యాటకులు ఆరు సభ్య దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ , కువైట్లను ఒకే వీసాపై సందర్శించవచ్చు.
ఏకీకృత వీసా ప్రాంతీయ పర్యాటక రంగం, మొత్తం ఆర్థిక వ్యవస్థలకు గేమ్-ఛేంజర్గా ఉంటుందని, GDPకి పెద్ద ప్రోత్సాహంతో పాటు ఉద్యోగాలను సృష్టిస్తుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏకీకృత GCC పర్యాటక వీసా ఈ ప్రాంతంలో 'బ్లీజర్' (బిజినెస్) ప్రయాణాన్ని పెంచుతుందని అంచనా వేస్తున్నారు.
గల్ఫ్లోని అరబ్ దేశాల సహకార మండలి కోసం గణాంక కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం..ఈ ప్రాంతం 2023లో 68.1 మిలియన్ల సందర్శకులను స్వాగతించింది. పర్యాటక ఆదాయంలో రికార్డు స్థాయిలో $110.4 బిలియన్లను ఆర్జించింది. ఇది 2019లో మహమ్మారికి ముందు స్థాయిలతో పోలిస్తే పర్యాటకుల రాకపోకలలో 42.8 శాతం పెరుగుదల కావడం గమనార్హం.
తాజా వార్తలు
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!









