హనీ ట్రాప్ లో చిక్కిన వృద్ధుడు రూ.38.73 లక్షలు నష్టం
- June 18, 2025
హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఇటీవల సైబర్ నేరగాళ్లకు బలయ్యాడు. హనీ ట్రాప్ ద్వారా మాయ చేసి అతని వద్ద నుంచి దాదాపు రూ.38.73 లక్షలు కాజేశారు.ఈ ఘటన మొదట ఫేస్బుక్ లో మొదలైంది.వృద్ధుడికి ఒక మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. మహిళ తనను తండ్రి వదిలేసి వెళ్లిపోయినట్లుగా, తల్లి ఒక సాధారణ టైలర్గా జీవనం సాగిస్తున్నదని పరిచయం చేసుకుంది.తన జీవిత కథను తేలికగా చెప్పి మానవత్వాన్ని రేకెత్తించిన ఆమె, వృద్ధుడితో చాటింగ్ చేయాలంటే ఇంటర్నెట్ సదుపాయం అవసరమని చెప్పారు. ఇందుకోసం ఆమె ఓ కేబుల్ ఆపరేటర్ నంబర్ను ఇచ్చింది.
కేబుల్ ఆపరేటర్తోనే చాటింగ్..
వృద్ధుడు మహిళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో, ఆమె సూచించిన కేబుల్ ఆపరేటర్కి సంప్రదించి రూ. 10,000 చెల్లించాడు. అయితే, ఈ చెల్లింపు అనంతరం ఆ మహిళ నుంచి ఫేస్బుక్లో స్పందన లేకపోవడంతో.. వృద్ధుడు అదే కేబుల్ ఆపరేటర్తోనే చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు.అప్పటికే మోసం మొదలైపోయిందన్న విషయం అతను గ్రహించలేకపోయాడు.కొద్ది రోజుల తర్వాత ఆ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని కేబుల్ ఆపరేటర్ చెప్పాడు.ఆ సమాచారం విని వృద్ధుడు చలించిపోయి, వెంటనే మరో రూ. 10 లక్షలు అతనికి పంపించాడు.ఈ సహాయం అనంతరం కూడా మోసం ఆగలేదు. మళ్లీ వృద్ధుడి క్రెడిట్ కార్డు నుంచి మరో రూ.2.65 లక్షలు వసూలు చేశారు.
ఈ క్రమంలో మొత్తం మొత్తం 38.73 లక్షలు వృద్ధుడు కోల్పోయాడు.తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు చివరికి నిజమైన పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటపడింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







