అమెరికా: రంగంలోకి దిగిన డూమ్స్ డే–నైట్వాచ్ విమానం…
- June 19, 2025
వాషింగ్టన్ డిసి–ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, యూఎస్ ప్రెసిడెన్షియల్ “డూమ్స్డే–“నైట్వాచ్ విమానం” వాషింగ్టన్ డిసి సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్లో ల్యాండ్ అయింది.అణు యుద్ధం లేదా ప్రపంచ అత్యవసర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ఈ విమానాన్ని సాధారణంగా అమెరికా అధ్యక్షుడు, అగ్ర సైనిక నాయకత్వం ఉపయోగిస్తారు.డూమ్స్ డే నైట్వాచ్ విమానం అధునాతన కమ్యూనికేషన్ గేర్ను కలిగి ఉంది.ఇది ఆకాశంలో ఇంధనం నింపుకుంటుంది.ఇది అణు దాడి లేదా ఏ రకమైన విద్యుదయస్కాంత దాడి ద్వారా ప్రభావితం కాదు.
“నైట్వాచ్” అధికారికంగా నేషనల్ ఎయిర్బోర్న్ ఆపరేషన్స్ సెంటర్ అని పిలుస్తారు.అణు విస్ఫోటనాలు, విద్యుదయస్కాంత పల్స్ వంటి ముప్పులను తట్టుకునేలా రూపొందించారు.ఈ విమానాన్ని తొలిసారి సెప్టెంబర్ 11, 2001 ఉగ్రవాద దాడుల సమయంలో ఉపయోగించారు. అప్పటి నుంచి అత్యంత సున్నితమైన పరిస్థితులలో మాత్రమే యాక్టివ్ చేస్తున్నారు.ఈ విమానం ఎందుకు బయలుదేరిందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విమానంలో ఉన్నారా లేదా అనేది కూడా స్పష్టంగా తెలియకపోయినా, వర్జీనియా మీదుగా వాషింగ్టన్ డిసికి చేరుకున్న దాని టేకాఫ్ సమయం, మార్గం అమెరికా రక్షణ మౌలిక సదుపాయాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని సూచిస్తున్నాయి.
అందుబాటులో నాలుగు విమానాలు..
ఇరాన్ పై ఇజ్రాయెల్ సైనిక చర్యను తీవ్రతరం చేయడం, ఇటీవలి క్షిపణి దాడులు మధ్యప్రాచ్యం అంతటా అస్థిరతను పెంచాయి.ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక యుద్ధనౌకలు, ఎఫ్-16 యుద్ధ విమానాలు కూడా మోహరించాయి.ఈ నేపథ్యంలోనే అమెరికా వద్ద ఉన్న నాలుగు విమానాలలో ఒకదానిని వాషింగ్టన్ డిసిలో అందుబాటులో ఉంచారు.యుద్ధం లేదా అణు దాడి జరిగినప్పుడు,అధ్యక్షుడు, ఉన్నత సైనిక అధికారులు భూమి నుంచి సురక్షితమైన దూరం నుంచి నిర్ణయాలు తీసుకునేలా “బ్యాకప్ కమాండ్ సిస్టమ్”ను యాక్టివ్గా ఉంచడానికి అమెరికా చేసిన సన్నాహకంగా ఈ చర్యగా ఈ విమానాన్ని రంగంలోకి దింపి ఉండవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







