ఇజ్రాయెల్ నేరాలను ఆపాలి.. ప్రపంచ దేశాలకు సౌదీ అరేబియా పిలుపు..!!
- June 19, 2025
జెనీవా: మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ నేరాలు, ఉల్లంఘనలను ఆపడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి సౌదీ శాశ్వత ప్రతినిధి రాయబారి అబ్దుల్మోహ్సేన్ బిన్ ఖోథైలా.. UN మానవ హక్కుల మండలిని ఉద్దేశించి ప్రసంగించారు. పాలస్తీనా, ఇతర ఆక్రమిత అరబ్ భూభాగాల్లో మానవ హక్కుల పరిస్థితిపై జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి ముప్పు కలిగిస్తున్న ఇజ్రాయెల్ దురాక్రమణను వెంటనే నిలిపివేయడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని బిన్ ఖోథైలా కోరారు. సౌదీ రాయబారి ఇజ్రాయెల్ చట్టవిరుద్ధమైన ఆక్రమణ, స్థావరాల విస్తరణ, నిరాయుధ పౌరులపై పదేపదే దాడులు వంటి ఉల్లంఘనలను ఖండించారు. వీటిని అంతర్జాతీయ చట్టంలోని అన్ని సూత్రాలను స్పష్టంగా ఉల్లంఘించినట్లు ఆయన అభివర్ణించారు.
అంతర్జాతీయ చట్టబద్ధత, అరబ్ శాంతి చొరవకు అనుగుణంగా ఆక్రమిత పాలస్తీనా భూభాగాలన్నింటినీ ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని ఖండించారు. తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దుల వెంబడి స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించకుండా పాలస్తీనా లక్ష్యానికి న్యాయమైన, సమగ్రమైన పరిష్కారం సాధించలేమని సౌదీ అరేబియాప్రతినిధి మరోసారి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









