రియాద్ ఎక్స్పో 2030 కోసం కొత్త కంపెనీ ప్రారంభం..!!
- June 20, 2025
రియాద్: పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF).. ఎక్స్పో 2030 రియాద్ కంపెనీని ప్రారంభించినట్లు ప్రకటించింది. సౌదీ అరేబియాలో మొట్టమొదటిసారిగా ఎక్స్పో 2030 రియాద్ కోసం కంపెనీ సౌకర్యాలను నిర్మించి, నిర్వహిస్తుంది. రియాద్ ఎక్స్పో 2030 కోసం రియాద్కు ఉత్తరాన 6 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ వేశారు. ఇది ఎగ్జిబిషన్ చరిత్రలో అతిపెద్ద ఎక్స్పో సైట్లలో ఒకటిగా ఉంటుందని, ఇది అనేక కీలకమైన ప్రముఖ ప్రదేశాలకు నేరుగా అనుసంధానించబడి ఉంటుందని తెలిపారు.
ఎక్స్పో 2030 రియాద్ 40 మిలియన్లకు పైగా సందర్శనలను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయిన తర్వాత, కంపెనీ ఈ ప్రదర్శనను ఒక ప్రపంచ గ్రామంగా, రిటైల్ , ఫుడ్, సాంస్కృతిక కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఇది భవిష్యత్ లో ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు.
సౌదీ అరేబియాలో ఆర్థిక పెట్టుబడులను సృష్టించడానికి, స్థిరమైన రాబడిని నిర్ధారించడానికి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పనిచేస్తుందని PIFలోని స్థానిక రియల్ ఎస్టేట్ పెట్టుబడి విభాగం అధిపతి సాద్ అల్క్రౌడ్ తెలిపారు. ఎక్స్పో 2030 రియాద్ అక్టోబర్ 1, 2030 నుండి మార్చి 31, 2031 వరకు జరుగుతుంది. అంతర్జాతీయ వ్యాపారాలకు కేంద్రంగా మారుతుందన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధానులలో ఒకటిగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ