ట్రావెల్ బీమా యుద్ధం, సంఘర్షణలను కవర్ చేస్తుందా?
- June 20, 2025
యూఏఈ: మిడిలీస్ట్ లో తలెత్తిన ఇటీవలి ఉద్రిక్తతల కారణంగా ట్రావెల్ బీమా కోసం డిమాండ్ పెరగడానికి దోహదపడ్డది. ఆకస్మిక పరిస్థితుల నుండి రక్షణ కోసం అనేక మంది ట్రావెల్ బీమాను తీసుకుంటున్నారని ఒక భీమా సంస్థ తెలిపింది.యూఏఈ విమానయాన సంస్థలు ఇరాక్, జోర్డాన్, లెబనాన్, ఇరాన్, ఇజ్రాయెల్తో సహా అనేక గమ్యస్థానాలకు విమాన సర్వీసులను రద్దు చేసింది. కానీ, యూఏఈ నుండి కొంతమంది ప్రయాణికులు చివరి నిమిషంలో తమ గమ్యస్థానాలను మార్చుకున్నారు. మరికొందరు ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయబడిన విమాన మార్గాల ప్రభావం లేని దేశాలను ఎంచుకున్నారు.
అయినప్పటికీ, చాలా మంది ఎమిరాటీలు, ప్రవాసులు ప్రతి సంవత్సరం మాదిరిగానే వేసవి ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అయితే, చాలా ప్రామాణిక ప్రయాణ బీమా పాలసీలు భౌగోళిక-రాజకీయ అశాంతి లేదా సైనిక సంఘర్షణలకు క్లెయిమ్లను కవర్ చేయవని తెలుసుకోవాలని ఏజెంట్లు చెబుతున్నారు.
http://Policybazaar.aeలో జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ తోషితా చౌహాన్ మాట్లాడుతూ.. "భౌగోళిక-రాజకీయ అశాంతి లేదా సైనిక సంఘర్షణ నుండి నేరుగా తలెత్తే ప్రమాదాలకు క్లెయిమ్లు సాధారణ పాలసీ నిబంధనల కింద మినహాయించారని తెలిపారు. "సామాను నష్టం, వైద్య అత్యవసర పరిస్థితులు, ప్రయాణ ఆలస్యం, రద్దులకు వ్యతిరేకంగా ఆర్థిక రక్షణను అందిస్తుంది. కానీ ఇతర విషయాల్లో పరిహారం అందించదు" అని తెలిపారు. ప్రతి దేశం పర్యాటకులకు ప్రయాణ బీమాను తప్పనిసరి చేయకపోయినా, స్కెంజెన్ జోన్లోని దేశాలు, వైద్య అత్యవసర పరిస్థితుల కోసం ప్రయాణికులకు కనీస కవరేజ్ €30,000 (Dh126,387) కలిగి ఉండాలని చెబుతున్నాయని చౌహాన్ అన్నారు. అదేవిధంగా, థాయిలాండ్, టర్కీ మరియు కొన్ని గల్ఫ్ దేశాలు వంటి గమ్యస్థానాలు నిర్దిష్ట వీసా వర్గాలకు తప్పనిసరి ప్రయాణ బీమా పాలసీలను ప్రవేశపెట్టాయని తెలిపారు. ప్రయాణ బీమా అటువంటి ఖర్చులకు వ్యతిరేకంగా సమగ్ర రక్షణను అందిస్తుందన్నారు. వీటిలో అత్యవసర వైద్య చికిత్స, ట్రిప్ రద్దు, సామాను నష్టం, విమాన ఆలస్యం వంటివి ఉన్నాయని తెలిపారు.
ఇటీవలి ఇజ్రాయెల్-ఇరాన్ క్షిపణి దాడులు జరగక ముందే, యూఏఈలో ప్రయాణ బీమా ప్రీమియంలు రెండంకెల రేటుతో పెరిగాయి. ముఖ్యంగా యూరప్ వెళ్లే ప్రయాణికులకు, గరిష్ట అవుట్బౌండ్ ప్రయాణ సీజన్కు ముందు బీమా ప్రిమియంలు పెరిగాయి. పాలసీబజార్ యూఏఈ ప్రకారం, ప్రయాణ బీమా ప్రీమియంలు 12 శాతం పెరిగాయి.
సంవత్సరానికి శాతం నుండి 18 శాతం వరకు ప్రిమియం పెరిగింది. వెళ్లే దేశం, ప్రయాణికుల వయస్సు ఆధారంగా పాలసీకి Dh15 నుండి Dh70 వరకు పెరుగుతుందని http://Insurancemarket.ae డిప్యూటీ సీఈఓ అయిన హితేష్ మోత్వానీ తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!