ఆత్మాహుతి దాడులతో వణికిపోతున్న ఇరాక్..
- July 13, 2016
ఇటీవల ఇరాక్ వరుస ఆత్మాహుతి దాడులతో వణికిపోతోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యం అధికంగా ఉన్న ఇరాక్లో ఉగ్రవాదులు విపరీతంగా దాడులకు తెగబడుతున్నారు. గత కొన్ని రోజులుగా వరుస దాడులు చేస్తున్న ఉగ్రవాదులు ఈరోజు బాగ్దాద్ జిల్లాలోని ఓ పోలీస్ చెక్పాయింట్పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పౌరులు, ఇద్దరు పోలీసులు ఉన్నారు. పేలుడు పదార్థాలు నిండిన కారుతో చెక్పోస్ట్లోకి దూసుకొచ్చి పేల్చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిన్న ఓ మార్కెట్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది చనిపోయారు. ఇరాక్లో గత నెలలో జరిగిన దాడుల్లో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







