బర్త్ డే రోజు కన్నీరు పెట్టుకున్న రాష్ట్రపతి..
- June 20, 2025
డెహ్రాడూన్: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన పుట్టినరోజు వేడుకల్లో భావోద్వేగానికి గురయ్యారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిసెబిలిటీస్ (NIEPVD)ను సందర్శించిన రాష్ట్రపతికి అక్కడి అంధ విద్యార్థులు గానం ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
పాటలతో మనసు తాకిన అంధ విద్యార్థులు
విద్యార్థుల మృదువైన గాత్రం, హృదయాన్ని తాకే పాటలు రాష్ట్రపతి ముర్మును ఆవేశానికి గురిచేశాయి. “వారిపాటలు వారి మనస్సుల లోతుల్లో నుంచి వచ్చినవే. అందుకే నా భావోద్వేగాన్ని ఆపలేక కన్నీళ్లు వచ్చాయి,” అని ఆమె అనంతరం తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు రాష్ట్రపతి దయాగుణానికి మెచ్చుకుంటున్నారు.
వికలాంగుల సాధికారత పై రాష్ట్రపతి ప్రత్యేక దృష్టి
ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, శారీరక వైకల్యంతో ఉన్నవారిలో ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుందని, వారికి సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే వారు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా వికలాంగుల సాధికారత కోసం చేపడుతున్న చర్యలను ఆమె వివరించారు. NIEPVD వంటి సంస్థలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. రాష్ట్రపతిగా కాకుండా ఓ తల్లి, మానవతావాది కోణంలో ఆమె చూపిన స్పందన, దేశ ప్రజల గుండెల్లో గాఢంగా మిగిలిపోయింది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









