ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం..కొత్త బడ్జెట్ ట్రావెల్ ట్రెండ్స్..!!
- June 21, 2025
యూఏఈ: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కొత్తగా బడ్జెట్ ట్రావెల్ ట్రెండ్స్ వెలుగులోకి వచ్చాయి.చాలా మంది యూఏఈ నివాసితులు జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్ వంటి దేశాలకు తమ వేసవి సెలవులను రద్దు చేసుకున్నారు. కానీ ఈ మార్పు ఆగ్నేయాసియా , దూర ప్రాచ్య దేశాలకు ఆసక్తిని పెంచడంతో కొత్త బడ్జెట్ ప్రయాణ ధోరణులకు తెరతీసిందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.
“థాయిలాండ్, వియత్నాం, లావోస్, చైనా, జపాన్, శ్రీలంక వంటి గమ్యస్థానాలకు ఇప్పుడు ప్రాధాన్యత పెరుగుతోంది.” అని వైజ్ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ థెకేపురథ్వలప్పిల్ అన్నారు. “ప్రయాణికులు ఇప్పుడు తూర్పు వైపు చూస్తున్నారు. చాలామంది సమ్మర్ లో విశ్రాంతిని చల్లచల్లగా ఆస్వాదించాలనుకుంటున్నారు.” అని తెలిపారు. ఈ సంవత్సరం భారతదేశం , శ్రీలంక అత్యంత ఇష్టమైన ప్రదేశాలుగా నిలుస్తున్నాయని సుబైర్ తెలిపారు.
“కేరళలోని వర్షంతో తడిసిన పచ్చదనం, హిమాచల్లోని కొండ ప్రాంతాలు లేదా శ్రీలంకలోని టీ ఎస్టేట్లలో సమయం గడపడానికి ప్రజలు ఎంచుకుంటున్నారు. ఇది వేరే రకమైన అనుభవం, ప్రశాంతత, చల్లదనం, ఉత్తేజకరమైనది.” అని పేర్కొన్నారు.
ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ భాగస్వామి భరత్ ఐదాసాని మాట్లాడుతూ..ఈ ట్రెండ్ ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికన్ ప్రాంతాలకు కూడా మారుతోందని అన్నారు.“జార్జియా, సమీప దేశాలకు ప్రయాణాలను రద్దు చేసిన తర్వాత, చాలా మంది నివాసితులు ఆగ్నేయాసియా గమ్యస్థానాలకు తిరిగి బుక్ చేసుకుంటున్నారు.ఈ ప్రదేశాలు డబ్బుకు గొప్ప విలువ, వీసా-ఆన్-అరైవల్ లేదా ఇ-వీసా ఎంపికలు అందిస్తాయి.” అని తెలిపారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







