ఇరాన్పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా
- June 22, 2025
ఇస్తాంబుల్: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు తెగబడటం స్పష్టమైన దురాక్రమణ అని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. దాడులు ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని, ప్రాంతీయ భద్రతకు ఇది విఘాతం కలిగించిందని తెలిపారు. ఇస్తాంబుల్లో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) 51వ కౌన్సిల్ ఆఫ్ విదేశాంగ మంత్రుల ప్రారంభ సమావేశంలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సౌదీ వైఖరిని వివరించారు.
సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని, ఉద్రిక్తతను నివారించాలని అన్ని పార్టీలను ఆయన కోరారు. ఇరాన్.. అంతర్జాతీయ సమాజం మధ్య దౌత్య చర్చలకు తిరిగి రావాల్సిన అవసరాన్ని వివరించారు. పాలస్తీనా సమస్య పట్ల సౌదీ అరేబియా నిబద్ధతతో పనిచేస్తుందని ప్రిన్స్ ఫైసల్ పునరుద్ఘాటించారు.
గాజాలో సంక్షోభాన్ని అరికట్టడానికి, దిగజారుతున్న మానవతా పరిస్థితిని పరిష్కరించడానికి.. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడానికి రాజ్యం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. "1967 సరిహద్దుల ఆధారంగా తూర్పు జెరూసలేం రాజధానిగా తమ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి పాలస్తీనా ప్రజల హక్కుకు తాము ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది. వారికి సౌదీ అండగా నిలుస్తుంది." అని ఆయన అన్నారు. ఈ అంశంపై అరబ్, ఇస్లామిక్ ఐక్యత కోసం సౌదీ అరేబియా కృషి చేస్తోందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







