ఇరాన్పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా
- June 22, 2025
ఇస్తాంబుల్: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు తెగబడటం స్పష్టమైన దురాక్రమణ అని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. దాడులు ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని, ప్రాంతీయ భద్రతకు ఇది విఘాతం కలిగించిందని తెలిపారు. ఇస్తాంబుల్లో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) 51వ కౌన్సిల్ ఆఫ్ విదేశాంగ మంత్రుల ప్రారంభ సమావేశంలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సౌదీ వైఖరిని వివరించారు.
సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని, ఉద్రిక్తతను నివారించాలని అన్ని పార్టీలను ఆయన కోరారు. ఇరాన్.. అంతర్జాతీయ సమాజం మధ్య దౌత్య చర్చలకు తిరిగి రావాల్సిన అవసరాన్ని వివరించారు. పాలస్తీనా సమస్య పట్ల సౌదీ అరేబియా నిబద్ధతతో పనిచేస్తుందని ప్రిన్స్ ఫైసల్ పునరుద్ఘాటించారు.
గాజాలో సంక్షోభాన్ని అరికట్టడానికి, దిగజారుతున్న మానవతా పరిస్థితిని పరిష్కరించడానికి.. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడానికి రాజ్యం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. "1967 సరిహద్దుల ఆధారంగా తూర్పు జెరూసలేం రాజధానిగా తమ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి పాలస్తీనా ప్రజల హక్కుకు తాము ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది. వారికి సౌదీ అండగా నిలుస్తుంది." అని ఆయన అన్నారు. ఈ అంశంపై అరబ్, ఇస్లామిక్ ఐక్యత కోసం సౌదీ అరేబియా కృషి చేస్తోందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!