అణుకేంద్రాలపై దాడులు.. రేడియేషన్ ఆందోళనలు.. యూఏఈ క్లారిటీ..!!
- June 23, 2025
యూఏఈ: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు నేపథ్యంలో తమ దేశంపై ఎటువంటి ప్రభావం చూపలేదని యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ న్యూక్లియర్ రెగ్యులేషన్ (FANR) తెలిపింది. ఇరాన్లోని అణు కేంద్రాలకు సంబంధించిన పరిణామాలను సంబంధిత జాతీయ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొంది. FANR అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA)తో సహా అంతర్జాతీయ సంస్థలతో పనిచేస్తూ.. నిరంతరం పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పుకార్లు ఇతర వార్తలపై స్పందించవద్దని ప్రజలను కోరింది.
అంతకుముందు, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత ఈ ప్రాంతంలో తీవ్రమైన పరిణామాలను నివారించడానికి దాడులను వెంటనే నిలిపివేయాలని యూఏఈ కోరింది. అమెరికా దాడులపై ప్రపంచవ్యాప్తంగా దేశాలు తీవ్రంగా ఖండించాయి.
యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ప్రకారం..ఇటువంటి చర్యలు ఈ ప్రాంతాన్ని అస్థిర పరుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు గల్ఫ్ సహకార మండలి జనరల్ సెక్రటేరియట్ కూడా ఇప్పటివరకు ఏ GCC దేశాలలోనూ "అసాధారణ రేడియేషన్ స్థాయిలు" గుర్తించలేదని పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







