అణుకేంద్రాలపై దాడులు.. రేడియేషన్ ఆందోళనలు.. యూఏఈ క్లారిటీ..!!
- June 23, 2025
యూఏఈ: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు నేపథ్యంలో తమ దేశంపై ఎటువంటి ప్రభావం చూపలేదని యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ న్యూక్లియర్ రెగ్యులేషన్ (FANR) తెలిపింది. ఇరాన్లోని అణు కేంద్రాలకు సంబంధించిన పరిణామాలను సంబంధిత జాతీయ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొంది. FANR అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA)తో సహా అంతర్జాతీయ సంస్థలతో పనిచేస్తూ.. నిరంతరం పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పుకార్లు ఇతర వార్తలపై స్పందించవద్దని ప్రజలను కోరింది.
అంతకుముందు, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత ఈ ప్రాంతంలో తీవ్రమైన పరిణామాలను నివారించడానికి దాడులను వెంటనే నిలిపివేయాలని యూఏఈ కోరింది. అమెరికా దాడులపై ప్రపంచవ్యాప్తంగా దేశాలు తీవ్రంగా ఖండించాయి.
యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ప్రకారం..ఇటువంటి చర్యలు ఈ ప్రాంతాన్ని అస్థిర పరుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు గల్ఫ్ సహకార మండలి జనరల్ సెక్రటేరియట్ కూడా ఇప్పటివరకు ఏ GCC దేశాలలోనూ "అసాధారణ రేడియేషన్ స్థాయిలు" గుర్తించలేదని పేర్కొన్నది.
తాజా వార్తలు
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు









