అణుకేంద్రాలపై దాడులు.. రేడియేషన్ ఆందోళనలు.. యూఏఈ క్లారిటీ..!!
- June 23, 2025
యూఏఈ: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు నేపథ్యంలో తమ దేశంపై ఎటువంటి ప్రభావం చూపలేదని యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ న్యూక్లియర్ రెగ్యులేషన్ (FANR) తెలిపింది. ఇరాన్లోని అణు కేంద్రాలకు సంబంధించిన పరిణామాలను సంబంధిత జాతీయ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొంది. FANR అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA)తో సహా అంతర్జాతీయ సంస్థలతో పనిచేస్తూ.. నిరంతరం పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పుకార్లు ఇతర వార్తలపై స్పందించవద్దని ప్రజలను కోరింది.
అంతకుముందు, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత ఈ ప్రాంతంలో తీవ్రమైన పరిణామాలను నివారించడానికి దాడులను వెంటనే నిలిపివేయాలని యూఏఈ కోరింది. అమెరికా దాడులపై ప్రపంచవ్యాప్తంగా దేశాలు తీవ్రంగా ఖండించాయి.
యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ప్రకారం..ఇటువంటి చర్యలు ఈ ప్రాంతాన్ని అస్థిర పరుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు గల్ఫ్ సహకార మండలి జనరల్ సెక్రటేరియట్ కూడా ఇప్పటివరకు ఏ GCC దేశాలలోనూ "అసాధారణ రేడియేషన్ స్థాయిలు" గుర్తించలేదని పేర్కొన్నది.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









