2028 నుండి ఒమన్ లో 5% ఆదాయపు పన్ను..!!
- June 23, 2025
ఒమన్: 2028 నుండి ఒమన్ వార్షిక ఆదాయం 42,000 ఒమన్ రియాల్స్ (సుమారుగా దిర్హామ్లు 400,000) కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులపై ఐదు శాతం ఆదాయపు పన్ను విధించనుంది. రాయల్ డిక్రీ నంబర్ 56/2025 జారీ చేసిన వ్యక్తిగత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఆదాయపు పన్నును ప్రవేశపెట్టే లక్ష్యం ప్రభుత్వ ఆదాయ వనరులను వైవిధ్యపరచడం, చమురు ఆదాయాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ ప్రాంతంలో వ్యక్తిగత ఆదాయపు పన్నును ప్రవేశపెట్టిన మొదటి గల్ఫ్ సహకార మండలి (GCC) దేశంగా సుల్తానేట్ అవతరించనుంది. యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాలు విలువ ఆధారిత పన్ను (VAT), కార్పొరేట్ ఆదాయపు పన్నును ప్రవేశపెట్టాయి. దాంతోపాటు నివాసితులలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి యూఏఈ పొగాకు, కార్బోనేటేడ్ పానీయాలపై కూడా పన్ను విధించింది. ఈ చట్టం 2028 ప్రారంభంలో అమల్లోకి వస్తుందని ఆదాయపు పన్ను ప్రాజెక్ట్ డైరెక్టర్ కరిమా ముబారక్ అల్ సాది తెలిపారు.
అయితే, కొన్ని మినహాయింపులు ప్రకటించారు. ఒమన్ సుల్తానేట్లో విద్య, ఆరోగ్య సంరక్షణ, వారసత్వం, జకాత్, విరాళాలు, ప్రాథమిక గృహనిర్మాణం, ఇతర సామాజిక పరిగణనలకు సంబంధించిన తగ్గింపులు, మినహాయింపులను కూడా ఈ చట్టంలో ప్రకటించారు.
వ్యక్తిగత ఆదాయపు పన్ను అమలుకు ముందు సమగ్ర అధ్యయనం నిర్వహించామని, ఇది మినహాయింపు పరిమితిని జాగ్రత్తగా పరిగణించిందని, ఒమన్ జనాభాలో దాదాపు 99 శాతం మంది ఈ పన్ను పరిధిలోకి రారని వెల్లడైందని ఒమన్ తెలిపింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







