వేసవి తాపం: తెలుగు స్రవంతి ఔదార్యం

- July 13, 2016 , by Maagulf

వేసవి తాపంతో కార్మికులు విలవిల్లాడుతున్నారు. దుబాయ్‌లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో కార్మికుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారికి ఉపశమనం కల్పించేందుకు తెలుగు స్రవంతి నడుం బిగించింది. తనవంతుగా కార్మికులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పించింది. ఎండ వేడిమితో విలవిల్లాడుతున్న 400 మంది కార్మికులకు తెలుగు స్రవంతి అరటిపళ్ళు, జ్యూస్‌లు, కేక్‌లు అందించింది. తెలుగు స్రవంతి చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల కార్మికులందరూ ప్రెసిడెంట్ శ్రీమతి లక్ష్మీ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com