అల్-ఉదీద్ యూఎస్ వైమానిక స్థావరంపై దాడిని తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- June 24, 2025
దోహా, ఖతార్: అల్-ఉదీద్ యూఎస్ వైమానిక స్థావరంపై దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రధానమంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మాజిద్ బిన్ మొహమ్మద్ అల్-అన్సారీ తన X ప్లాట్ఫామ్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఖతార్ రాష్ట్ర సార్వభౌమాధికారం, దాని గగనతలం, అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ ను ఇరాన్ ఉల్లంఘించిందని అన్నారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా..నేరుగా స్పందించే హక్కు ఖతార్కు ఉందన్నారు.
ఖతార్ వైమానిక రక్షణ దళాలు ఇరాన్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టాయని అన్నారు. ఇరానియన్ క్షిపణులతో నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఇటువంటి తీవ్రతరమైన సైనిక చర్యలు కొనసాగడం వల్ల ఈ ప్రాంతంలో భద్రత దెబ్బతింటుందని, అంతర్జాతీయ శాంతి, భద్రతకు విఘాతం కలుగుతుందని తెలిపారు. అన్ని సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలని, వెంటనే దౌత్య మార్గంలో చర్చలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!







