విద్యుత్, నీటి ప్రాజెక్టులపై కువైట్ ప్రధాన మంత్రి సమీక్ష..!!
- June 24, 2025
కువైట్: వ్యూహాత్మక ఇంధనం, నీటి డీశాలినేషన్ ప్రాజెక్టులపై తాజా డెవలప్ మెంట్ పై బయాన్ ప్యాలెస్లో జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా సమీక్షించారు. షాగయా, అల్-అబ్దాలియా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, అలాగే అల్-జోర్ నార్త్ (దశ 1 , 2), అల్-ఖిరాన్ ఫేజ్ 1, అల్-నువైసీబ్ ఫేజ్ 1, సుబియా విస్తరణ విద్యుత్ ప్లాంట్లు వంటి కీలకమైన భవిష్యత్ వెంచర్లపై చర్చించారు. నిర్దేశిత కాలపరిమితిలోగా వాటిని పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని వనరులను ఉపయోగించుకోవడం ద్వారా అడ్డంకులను అధిగమించాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రధానమంత్రి దివాన్ అధిపతి అబ్దులాజీజ్ అల్-దఖీల్, విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రి డాక్టర్ సుబైహ్ అల్-ముఖైజిమ్, మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







