విద్యుత్, నీటి ప్రాజెక్టులపై కువైట్ ప్రధాన మంత్రి సమీక్ష..!!
- June 24, 2025
కువైట్: వ్యూహాత్మక ఇంధనం, నీటి డీశాలినేషన్ ప్రాజెక్టులపై తాజా డెవలప్ మెంట్ పై బయాన్ ప్యాలెస్లో జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా సమీక్షించారు. షాగయా, అల్-అబ్దాలియా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, అలాగే అల్-జోర్ నార్త్ (దశ 1 , 2), అల్-ఖిరాన్ ఫేజ్ 1, అల్-నువైసీబ్ ఫేజ్ 1, సుబియా విస్తరణ విద్యుత్ ప్లాంట్లు వంటి కీలకమైన భవిష్యత్ వెంచర్లపై చర్చించారు. నిర్దేశిత కాలపరిమితిలోగా వాటిని పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని వనరులను ఉపయోగించుకోవడం ద్వారా అడ్డంకులను అధిగమించాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రధానమంత్రి దివాన్ అధిపతి అబ్దులాజీజ్ అల్-దఖీల్, విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రి డాక్టర్ సుబైహ్ అల్-ముఖైజిమ్, మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!







