డొనాల్డ్ ట్రంప్ బిగ్ అనౌన్స్మెంట్
- June 24, 2025
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. మరో ఆరు గంటల్లో ఈ ప్రక్రియ ప్రారంభమై..12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది అంటూ మంగళవారం తెల్లవారు జామున 2.32గంటలకు (భారత కాలమానం) ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ట్రూత్’ లో పోస్టు చేశారు. అయితే, ట్రంప్ ప్రకటించినట్లుగా కాల్పుల విరమణపై ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ట్రంప్ ఏమన్నారంటే.. ‘‘ఇజ్రాయెల్, ఇరాన్లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయి. 12గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది. తొలుత ఇరాన్ కాల్పుల విమరణను ప్రారంభించనుంది. అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరించనుంది. దీంతో 12రోజుల యుద్ధానికి ఎండ్ కార్డు పడనుంది. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేటప్పుడు మరో దేశం శాంతి, గౌరవంతో ఉండాల్సి ఉంటుంది. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందనే భావిస్తున్నాను. ఇజ్రాయెల్ , ఇరాన్ తో సహా మధ్యప్రాచ్యం, ప్రపంచ దేశాలతోపాటు అమెరికాకు దేవుడి దయ ఉంటుంది’’ అంటూ ట్రంప్ పోస్టు చేశారు.
ఇజ్రాయెల్ కు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులు రాయిటర్స్ తో మాట్లాడుతూ.. ఇరాన్ పై తమ దేశం కొనసాగిస్తున్న సైనిక మిషన్ ను ముగించడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం గురించి అమెరికాకు తెలియజేయడం జరిగింది అంటూ పేర్కొన్నారు. మరోవైపు.. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడులను ఆపితే.. తాము ఆపుతామని ప్రకటించారు.
తాజా వార్తలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు







