E311 వద్ద 2 నెలల ట్రాఫిక్ ఆంక్షలు..దుబాయ్ ఆర్టీఏ
- June 27, 2025
యూఏఈ: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ (E311) లోని అల్ బరారి అండర్పాస్ వద్ద జూన్ 28నుండి ట్రాఫిక్ మళ్లింపు (ఆంక్షలు) ప్రారంభం అవుతుందని దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. రెండు నెలల పాటు ఈ మళ్లింపు కొనసాగుతుందని తెలిపింది. వర్షపు నీరు, భూగర్భ నీటి పారుదల వ్యవస్థలను మెరుగుపరచడానికి, అలాగే ఈ ప్రాంతంలో రోడ్డు పునరుద్ధరణ పనుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
వాహనదారులు దుబాయ్-అల్ ఐన్ వంతెన (జెబెల్ అలీ వైపు U-టర్న్) లేదా గ్లోబల్ విలేజ్ అండర్పాస్, ఉమ్ సుకీమ్ స్ట్రీట్ కూడలి (షార్జా వైపు U-టర్న్) లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
మరోవైపు, షార్జాలో రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (SRTA) అల్ ఇంతిఫాదా స్ట్రీట్ నుండి అల్ కార్నిచ్ స్ట్రీట్ వరకు రోడ్డును మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మూసివేత జూలై 27 వరకు అమలులో ఉంటుందని తెలిపింది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్ట్ మొదటి దశ పనులు జరుగుతాయని వెల్లడించింది.
అలాగే, అబుదాబిలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. జూన్ 30 వరకు సుల్తాన్ బిన్ జాయెద్ ది ఫస్ట్ స్ట్రీట్లో పాక్షికంగా ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ స్ట్రీట్ నుండి షేఖా ఫాతిమా బింట్ ముబారక్ స్ట్రీట్కు ఫ్రీ రైట్ టర్న్ జూన్ 30న ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









