దుబాయ్ లో కొత్త విద్యా వ్యవస్థ.. స్టూడెంట్ వీసాలు, స్కాలర్షిప్లు..!!
- June 27, 2025
యూఏఈ: దుబాయ్ విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టబోయే భారీ మార్పులతో కొత్త విద్యార్థి వీసాలు, అంతర్జాతీయ స్కాలర్షిప్లతోపాటు 90 శాతం మంది స్టూడెంట్స్ తగిన ఉపాధిని పొందనున్నారు. 2033 నాటికి ఎమిరేట్ తన మొత్తం విశ్వవిద్యాలయ నమోదులో అంతర్జాతీయ విద్యార్థులు 50 శాతం ఉండాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాతిపాదనలను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆమోదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విద్యార్థులకు దుబాయ్ను గమ్యస్థానంగా మరియు ఆవిష్కరణలకు ఇంక్యుబేటర్గా మార్చడమే తమ లక్ష్యమని షేక్ హమ్దాన్ అన్నారు.
నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA), దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్.. ఎమిరేట్లోని అన్ని విశ్వవిద్యాలయ నమోదులలో సగం మంది అంతర్జాతీయ విద్యార్థులను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో ఉన్నత విద్యా రంగం దుబాయ్ GDPకి సుమారు Dh5.6 బిలియన్లకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఈ చొరవ 2033 నాటికి 70 కి పైగా ఉన్నత విద్యా సంస్థలను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ప్రపంచవ్యాప్తంగా టాప్ 200లో 11 యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రస్తుతం, దుబాయ్లో 37 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిలో కర్టిన్ యూనివర్సిటీ దుబాయ్, యూనివర్సిటీ ఆఫ్ వోలోంగాంగ్ ఉన్నాయి. రెండూ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 టాప్ 200లో స్థానం పొందాయి. అలాగే యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ దుబాయ్.. టాప్ 100 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో స్థానం పొందింది. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ దుబాయ్ టాప్ 50లో స్థానంలో ఉంది.
ఈ లక్ష్యాలను సాధించడానికి, ఈ ప్రాజెక్ట్ విద్యార్థి వీసా వ్యవస్థలలో అప్డేట్ లు, కొత్త అంతర్జాతీయ స్కాలర్షిప్లు, గ్రాడ్యుయేట్లకు వర్క్ వీసాలు, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలను ఆకర్షించే వ్యూహాలు, ప్రభావవంతమైన విశ్వవిద్యాలయ క్లస్టర్లను ప్రోత్సహించడంతో పాటు నాణ్యతను నిర్ధారించడానికి నియంత్రణ చట్రాలు, ఉన్నత విద్యా పెట్టుబడి నిధి, దుబాయ్ సైంటిఫిక్ రీసెర్చ్ నెట్వర్క్ను ప్రారంభిస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







