ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య
- June 28, 2025
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) చిక్కడపల్లిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి 10:30 గంటల సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విడాకులు, వ్యక్తిగత విభేదాల మధ్య తీవ్ర నిర్ణయం
స్వేచ్ఛ గతంలో తన భర్త నుంచి విడాకులు తీసుకుని, కుమార్తె మరియు స్నేహితుడితో కలిసి జీవిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ స్నేహితుడితో వ్యక్తిగత విభేదాలు రావడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఆమె తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజమైన కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు స్నేహితుడిని విచారించనున్నారు.
జర్నలిస్టు వర్గాల్లో విషాదం
స్వేచ్ఛ వోటార్కర్ జర్నలిజం రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల జరిగిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఈసీ సభ్యురాలిగా ఎన్నికైన ఆమె భవిష్యత్తుపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఆమె తండ్రి శంకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా, తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో సేవలందించారు. స్వేచ్ఛ అకస్మాత్తుగా మరణించడంతో జర్నలిస్టు సంఘాలు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







