పాక్ పై భారత్ తీవ్ర విమర్శలు..
- July 14, 2016
పాకిస్థాన్ ఉగ్రవాదులను పొగుడుతోందని భారత్ పాక్పై ఎదురుదాడికి దిగింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానిని భారత భద్రతాదళాలు మట్టుబెట్టిన అంశాన్ని పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తడంపై భారత్ పాక్ను తీవ్రంగా విమర్శిస్తోంది. పాక్ ఉగ్రవాదులపై ప్రశంసలు కురిపిస్తోందని.. ఉగ్రవాదాన్ని దేశ పాలసీగా పెట్టుకుని, ఇతర దేశాల భూభాగాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని భారత్ పేర్కొంది. ఐరాస జనరల్ అసెంబ్లీలో నిన్న మానవ హక్కుల అంశంపై జరిగిన చర్చలో పాక్ రాయబారి మలీహా లోధి ఉగ్రవాది బుర్హాన్ అంశం లేవనెత్తడంపై ఐరాసలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఘాటుగా స్పందించారు.
లోధి ప్రకటనలో బుర్హాన్ను కశ్మీరీ నేతగా అభివర్ణించడంపై భారత్ మండిపడింది. కశ్మీర్లో కల్లోల పరిస్థితులతో పాటు ఆమె కశ్మీరీ నేత అయిన బుర్హాన్ను న్యాయాధికార పరిధులను అతిక్రమించి భారత భద్రతాదళాలు హతమార్చాయని లోధి పేర్కొన్నారు. దీంతో పాక్ ఉగ్రవాదులను ప్రశంసిస్తోందంటూ అక్బరుద్దీన్ ప్రకటనలో తెలిపారు. ఐరాస వేదికను పాకిస్థాన్ దుర్వినియోగం చేస్తోందన్నారు. ఇది తీవ్రంగా ఖండించదగిన అంశమన్నారు.
పాక్ హైకమిషనర్కు సమన్లు పంపనున్న భారత్ బుర్హాన్ వాని అంశంలో భారత్ పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్కు సమన్లు పంపనుంది. బుర్హాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాల్సిందిగా కోరనుంది. జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఇప్పటికే బుర్హాన్పై ఉన్న పలు కేసులకు సంబంధించి వివరాలు హోంమంత్రిత్వ శాఖకు పంపించింది. అతడిపై 12 ఎఫ్ఐఆర్లు పెండింగ్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







