ఘనంగా జంధ్యాల పాపయ్య శాస్త్రి 34వ వర్ధంతి
- June 29, 2025
హైదరాబాద్: వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కళాలలిత కళావేదికలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి 34వ వర్ధంతి సందర్భంగా, గాయకుడు వీఆర్కే ఫణి నిర్వహణలో "నేనొక పూల మొక్కకడ నిల్చి" ప్రైవేట్ గీతాల ప్రత్యేక కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహించబడింది.
ప్రధాన గాయకుడైన ఫణిని,ఘంటసాల స్వర్ణపతకంతో వంశీ రామరాజు మరియు ముఖ్య అతిథిగా పాల్గొన్న సురేఖ మూర్తి దివాకర్ల సత్కరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ ఆదినారాయణ, రవీంద్ర, నిషీజా రమణి, హృషీకేశ్, ఘంటసాల వెంకటేశ్వర రావులను సురేఖ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వంశీ ప్రెసిడెంట్ సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజ పాల్గొన్నారు.
వంశీ రామరాజు ప్రసంగిస్తూ, తమకు కరుణశ్రీ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు.
"వారు పుట్టిన ఊరులోనే నేను పుట్టాను" అని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంలో కరుణశ్రీ కుటుంబ సభ్యులు వీక్షించడం తమకు ఆనందం కలిగించిందని వంశీ రామరాజు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







