సెప్టెంబర్ 10 నుంచి ఆసియా కప్!
- June 29, 2025
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ జూలై మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు క్రిక్బజ్ తెలిపింది.అయితే..ఇటీవల ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందా? ఉండదా? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరగనుంది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది.ఆరు జట్లు.. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఎఈ లు ఈ మెగాటోర్నీలో పాల్గొనున్నాయి.అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్తో జరిగిన ఒప్పందం ప్రకారం.. పాక్ మ్యాచ్లను యూఏఈలో లో నిర్వహించే అవకాశం ఉంది.
ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. ఈ క్రమంలో రెండు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయా? ఒకవేళ పాల్గొన్నా కూడా కలిసి ఆడతాయా? అన్న ప్రశ్నలు ఉదయించాయి. అదే సమయంలో ఆసియా కప్ నుంచి భారత్ వైదొలగాలనే నిర్ణయం తీసుకుందనే వార్తలు వినిపించాయి.
‘ఆసియాకప్లో పాల్గొనకపోవడం లేదా మ్యాచ్లను బాయ్కట్ చేయడం గురుంచి ఎటువంటి చర్చ కూడా జరగలేదు.ఐసీసీ ఈవెంట్లలో మేము పాకిస్తాన్తో ఆడుతాము.ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాము.’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు ఇన్సైడ్ స్పోర్ట్ తెలిపింది.
2025 మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి.దీని పై అటు పీసీబీ, ఇటు బీసీసీఐ నుంచి వ్యతిరేకత రాలేదు.దీంతో ఆసియా కప్లో భారత్, పాక్లు ఒకే గ్రూపులో ఉండే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









