క్యాబిన్ బ్యాగులపై రూ. 900 చొప్పున ఛార్జీలు..
- July 14, 2016
దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించే వారికి ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ షాకిచ్చింది. అదనపు క్యాబిన్ బ్యాగులపై రూ. 900 చొప్పున ఛార్జీలు వసూలు చేసేందుకు నిర్ణయించింది. దేశంలోని ఆరు మెట్రోల నుంచి ప్రయాణించే వారికి శుక్రవారం నుంచి ఈ ఛార్జీలు వర్తిస్తాయి.
ప్రస్తుతం దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణికులకు.. 7 నుంచి 10కిలోల బరువు గల ఒక క్యాబిన్ బ్యాగ్, ఒక ల్యాప్టాప్ బ్యాగ్, ఒక పర్సు(మహిళలకు)ను ఉచితంగా తీసుకెళ్లే సదుపాయం ఉంది. అయితే ఇటీవల ప్రయాణికులు తమ వెంట పరిమితికి మించి క్యాబిన్ బ్యాగులను తీసుకురావడం ఎక్కువవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెట్ఎయిర్వేస్ తెలిపింది. ఆదాయం కోసం తాము ఈ ఛార్జీలు వసూలు చేయడం లేదని.. ఎక్కువగా క్యాబిన్ బ్యాగులు తీసుకురావడంతో విమానంలో స్టోరేజ్ సమస్య ఏర్పడుతుందని జెట్ పేర్కొంది. దీని వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడటమే గాక.. విమానాల ఆలస్యానికి కూడా కారణమవుతుందని చెప్పింది.
అయితే జెట్ఎయిర్వేస్ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







